రామ్ చరణ్‌ విషయంలో అది ఫూలిష్ – లోకేష్ కనకరాజ్

రామ్ చరణ్‌ సౌత్ ఇండియన్ లేటెస్ట్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. ఫస్ట్ మూవీ మా నగరం తో తమిళ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న లోకేష్‌ తర్వాత ఖైదీతో కంట్రీ మొత్తాన్ని ఫిదా చేశాడు. ఖైదీ డబ్బింగ్ వెర్షన్ చూసినవాళ్లంతా లోకేష్ టేకింగ్ కు మెస్మరైజ్ అయ్యారు. ఆ తర్వాత కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ తో చేసిన మాస్టర్ సైతం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచి హ్యాట్రిక్ అందించింది. ఇక లేటెస్ట్ గా విక్రమ్ తో ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్స్(తమిళ్) సాధించి సత్తా చాటాడు. అంతే కాదు.. ఈ మూవీతో చాలాయేళ్ల తర్వాత కమల్ హాసన్ కు మాస్ హిట్ ఇచ్చాడు. ఒకే సినిమాలో ముగ్గురు టాప్ స్టార్స్ ను తీసుకుని అందరికీ సమన్యాయం చేసేలా స్క్రిప్ట్ చూసుకున్నాడు. చివర్లో వచ్చిన సూర్య పాత్రతో మరో సీక్వెల్ కు రంగం సిద్ధం చేసుకున్నాడు. దీంతో ఇప్పుడు అందరు స్టార్ హీరోల దృష్టీ లోకేష్ పై పడింది. అది తెలుగు హీరోల విషయంలోనూ జరిగింది అనే వార్తలు నిరంతరం వస్తున్నాయి. అలాంటి ఒక వార్తనే ఫూలిష్ అంటూ కొట్టిపడేశాడు లోకేష్.
విక్రమ్ విజయం సాధించిన తర్వాత ఆ మూవీ టీమ్ ను తన ఇంటికి డిన్నర్ కు ఇన్వైట్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి.

కమల్ తో ఉన్న స్నేహం కారణంగానే చిరు వారిని అభినందించేందుకు ఈ ప్లాన్ చేశాడు. అయితే ఆ టైమ్ లో చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్‌ తో సినిమా చేయాలని లోకేష్‌ ను కోరినట్టుగా వార్తలు వండేశారు మనవాళ్లు. దీనికి తోడు కొన్ని రోజుల తర్వాత లోకేష్‌ కూడా చరణ్ ను కలిశాడు. ఇంకేముందీ ఇది నిజమే అంటూ టాంటామ్ చేశారు. మొదట్లో చిన్న రూమర్ గానే ఉన్నా.. తర్వాత ఇది అన్ని భాషల్లోకీ వెళ్లింది. దీంతో చిరంజీవి గారు చరణ్ తో సినిమా చేయాలని అడిగాడు అంటూ వస్తోన్న వార్తలన్నీ ఫూలిష్ అని కొట్టిపడేశాడు. చరణ్‌ నాకు అంతకు ముందు నుంచే తెలుసు. గతంలోనే రెండుసార్లు కలిశాను. చిరంజీవి గారి ఇంటికి డిన్నర్ కు వెళ్లినప్పుడు అసలు అక్కడ చరణ్‌ లేడు అంటూ ఓ క్లారిటీ ఇచ్చాడు. అదన్నమాట సంగతి. అది సరే కానీ తర్వాత కాలంలో అయినా చరణ్ తో సినిమా ఉంటుందా లోకేష్ అంటే ఏం చెబుతాడో మరి..

Related Posts