మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్

మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఈ ఉదయం సోషల్ మీడియా ద్వారా ఆయన వెల్లడించారు. నిన్నటి నుంచి స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని, దాంతో టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ గా రిజల్ట్ వచ్చిందని ఆయన ట్వీట్ లో తెలిపారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా సోకిందని, ఇటీవల తనను కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలని మెగాస్టార్ విజ్ఞప్తి చేశారు.

ఫస్ట్ వేవ్ టైమ్ లో మెగాస్టార్ తనకు కరోనా సోకిందని ప్రకటించారు. అయితే అది టెస్ట్ చేసిన పరికరంలో లోపం వల్ల కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తర్వాత చెప్పారు. ఇవాళ మెగాస్టార్ చిరంజీవి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన గుడ్ లక్ సఖి సినిమా ప్రీరిలీజ్ కార్యక్రమానికి హాజరవ్వాల్సి ఉంది. కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ కావడంతో చిరు ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. మెగాస్టార్ స్థానంలో రామ్ చరణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్తున్నారు.

మరోవైపు టాలీవుడ్ లో కరోనా వ్యాపిస్తోంది. హీరో శ్రీకాంత్ తనకు కోవిడ్ సోకినట్లు తెలిపారు. ఆయన కూడా ఇవాళే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత రెండు రోజులుగా స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని, టెస్టులో పాజిటివ్ గా వచ్చిందని శ్రీకాంత్ తెలిపారు. తనను ఇటీవల కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలని ట్వీట్ లో కోరారు.

Related Posts