నందమూరి నటిసింహం బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం అఖండ. ఈ సినిమా అందరి అంచనాలకు మించిన విజయం సాధించింది. చిత్ర పరిశ్రమకు ధైర్యాన్ని ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో సైతం రికార్డు కలెక్షన్స్ సాధించడం విశేషం. ఈ సందర్భంగా అఖండ టీమ్ ఈరోజు విజయవాడ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం బాలకృష్ట మాట్లాడుతూ… అఖండ సినిమా అఖండమైన విజయం సాధించింది. సినిమా విజయంతో అమ్మవారిని దర్శించుకున్నాం. సకుటుంబ సపరివార సమేతంగా సినిమాకి రావడం సంతోషంగా ఉంది. నందమూరి తారక రామారావు గారు ఆనాడు భక్తిని కాపాడారు.. ఇప్పుడు సనాతన దర్మాన్ని కాపాడిన సినిమా అఖండ. ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకి కృతజ్ఞతలు. ఏదైనా పని తలపెడితే విజయం తథ్యం. అమ్మవారి అశీస్సులతో సినిమా దిగ్విజయంగా ప్రదర్శింపబడుతుంది.
మంచి సినిమాను ప్రజలు ఆదరిస్తారని మరోసారి నిరూపించారు. టిక్కెట్ల విధానం పై గతంలో చర్చించుకున్నాం.. ఏదైతే అదని సినిమా విడుదల చేసాం. సినిమా మంచిగా వచ్చిందని డేర్ స్టెప్ వేశాం. కొంత మంది ఆగినా మేమెక్కడా వెనుకడుగు వేయలేదు. ప్రభుత్వం అప్పీల్ కు వెళ్తామంటున్నారు చూద్దాం ఏం జరగనుందో. దానిని బట్టి నేను స్పందిస్తాను అన్నారు. ఇక మల్టీస్టారర్ సినిమాల గురించి అడుగుతున్నారు.. మంచి కధ వస్తే ఎవరితో అయినా మల్టీస్టారర్ సినిమా చేస్తాను అన్నారు.