మహేష్ బాబు మాట నిలబెట్టుకుంటాడా..?

ఏ సినిమా అయినా.. చెప్పిన డేట్ కు రిలీజ్ కాకపోతే కొంత ఆసక్తి తగ్గుతుంది. అయితే అందులో నటించే స్టార్స్ ను బట్టి క్రేజ్ ఉంటుంది కాబట్టి.. ఓపెనింగ్స్ పై ఈ ఎఫెక్ట్ పడదు. అందుకే ఒక్కోసారి చెప్పిన టైమ్ కు దాటి మరీ విడుదల చేస్తుంటారు. ఇందుకు ప్రధాన కారణం షూటింగ్ ఆలస్యం కావడమే అనేది కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సమ్ టైమ్స్.. కంటెంట్ వీక్ గా ఉంటే.. మళ్లీ రీ షూట్స్ కు వెళతారు. అదీ ఆలస్యానికి ఓకారణం. మరి వీటిలో కారణాలేవో కానీ.. మహేష్ బాబు కొత్త సినిమా సర్కారు పాట సినిమా ముందు ప్రకటించిన మే 12న విడుదల కావడం అసాధ్యం అనే రూమర్స్ పుట్టుకు వచ్చాయి. అందుకు కారణాలు కూడా ఉన్నాయి మరి.

కొన్నాళ్లుగా సినిమా షూటింగ్ షెడ్యూల్స్ ను కరోనా డిసైడ్ చేసింది.. చేస్తోంది కూడా.. అప్పుడు ఇబ్బంది అయిన షెడ్యూల్స్ ను ఇప్పుడు సెట్ చేస్తున్నారు. ఈ కారణంగా చెప్పిన టైమ్ కు విడుదల చేయడం దాదాపు అసాధ్యంగా మారుతోంది. ఇది సర్కారు వారి పాట విషయంలోనూ జరిగింది. అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఆలస్యంగా షూటింగ్ జరిగిందన్నారు. దీనికి తగ్గట్టుగానే ఈ రూమర్స్ పై ఆ సినిమాకు సంబంధించిన ఎవరూ స్పందించలేదు. దీంతో మే 12న సర్కారు వారి పాట విడుదల కావడం కష్టం అనే నిర్ధారణకు వచ్చారు కొందరు. బట్ లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఓ కీలకమైన అప్డేట్ వచ్చింది.

సర్కారు వారి పాట సినిమా షూటింగ్ పూర్తయిపోయిందట. కాకపోతే ఒక్క పాట బ్యాలన్స్ ఉందంటున్నారు. ఆ ఒక్క పాటను ఎక్కడ తీస్తారు అనేది చెప్పలేదు. అలాగే ఈ సందర్భంగా అన్ని రూమర్స్ కు చెక్ పెడుతూ మే 12న వస్తున్నాం అనే ఒక్క మాట కూడా ఈ అప్డేట్ లో లేకపోవడంతో మహేష్ సినిమా మాట నిలబెట్టుకుంటుందా లేదా అనే కొత్త చర్చ మొదలైంది. ఏదేమైనా ప్రస్తుతం సమ్మర్ సీజన్ సరిగ్గానే నడుస్తోంది సినిమా పరిశ్రమలకు. ఇలాంటి టైమ్ ను మిస్ చేసుకుని మళ్లీ రిస్క్ లో పడేకంటే కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని చెప్పిన టైమ్ కే రిలీజ్ చేస్తే బెటర్ అనేది మెజారిటీ పీపుల్ ఒపీనియన్.

Related Posts