బాలీవుడ్ బాధలకు చెక్ పెట్టేది ఎవరు..?

బ్లాక్ బస్టర్స్ కోసం బాలీవుడ్ స్ట్రగులింగ్ కంటిన్యూ అవుతూనే ఉంది. రీసెంట్ గా రణ్‌బీర్ కపూర్ షంషేరాపై చాలా హోప్స్ పెట్టుకుంటే అదీ పోయింది. దీంతో రాబోతోన్న భారీ సినిమాలపై ఆశలు పెంచుకుంది. ముఖ్యంగా ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డాతో పాటు మరోసారి రణ్‌బీర్ కపూర్ బ్రహ్మాస్త్ర బాలీవుడ్ ను కష్టాల నుంచి గట్టెస్తాయని నమ్ముతున్నారు. మరి ఈ రెండు సినిమాల్లో వారి ఆశలు నెరవేర్చే స్టార్ ఎవరు..?
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నుంచి ఓ సినిమా అంటే బలమైన కంటెంట్ ఖచ్చితంగా ఉంటుందని అందరికీ తెలుసు. కంటెంట్ ఉంటేనే అతను కమిట్ అవుతాడు.

అయితే ఈ సారి రీమేక్ తో వస్తున్నాడు ఆమిర్. హాలీవుడ్ హిట్ మూవీ ఫారస్ట్ గంప్ ను లాల్ సింగ్ చడ్డాగా రీమేక్ చేశాడు. ఆమిర్ కూడా ఓ నిర్మాతగా ఉన్న ఈ చిత్రాన్ని అద్వైత్ చందన్ డైరెక్ట్ చేశాడు. ఈ నెల 11న వస్తోన్న లాల్ సింగ్ చడ్డా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తాడు అంటున్నారు. నాగచైతన్య ఓ కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో కరీనా కపూర్ హీరోయిన్. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని ఆమిర్ కంటే ఎక్కువగా బాలీవుడ్ కోరుకుంటోంది. తెలుగులో ఈ చిత్రానికి చిరంజీవి సమర్పించాడు.చాక్లెట్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న రణ్‌బీర్ కపూర్ చాలాకాలం క్రితమే హిట్ ట్రాక్ దిగాడు.

మళ్లీ ట్రాక్ ఎక్కేందుకు చేస్తోన్న ఏ ప్రయత్నమూ పెద్దగా ఫలించడం లేదు. మాస్ ను మెప్పిస్తుందనుకున్న షంషేరా అతనికి పెద్ద షాక్ ఇచ్చింది. ఈ సారి బ్రహ్మాస్త్రగా వస్తున్నాడు. ఫాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్ గా వస్తోన్న ఈ మూవీలో తన వైఫ్‌ అలియాభట్ హీరోయిన్. రెండు భాగాలుగా రూపొందిన ఈ మూవీ సెప్టెంపర్ 9న పార్ట్ ”బ్రహ్మాస్త్ర పార్ట్ ఒన్ శివ”గా విడుదల కాబోతోంది. నాగార్జున కూడా ఓ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బ్రహ్మాస్త్ర 1తో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని అంతా నమ్ముతున్నారు. లాల్ సింగ్ ను చిరంజీవి ప్రెజెంట్ చేస్తోంటే బ్రహ్మాస్త్రను రాజమౌళి తెలుగులో ప్రెజెంట్ చేయబోతున్నాడు. మరి ఈ రెండు సినిమాలతో బాలీవుడ్ కు కొత్త ఊపు వస్తుందా లేదా అనేది చూడాలి.

Related Posts