విజయ్ దేవరకొండకు దర్శకుడు దొరికాడు.. కానీ ..?

అంతకు ముందు వచ్చిన ఫ్లాపుల కంటే లైగర్ ఫ్లాప్ తోనే ఎక్కువ సమస్యలు ఫేస్ చేశాడు విజయ్ దేవరకొండ.ఈ మూవీకి ముందు అతని బిహేవియర్ విమర్శల పాలు కావడం కూడా అందుకు ఓ కారణంగా చెప్పొచ్చు. పైగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో చేసిన సినిమా కాబట్టి విజయ్ దేవరకొండ కెరీర్ కు చాలా హెల్ప్ అవుతుందనుకుంటే ఇంకెప్పుడూ సరిదిద్దుకోనంత మైనస్ అయిందీ చిత్రం. దీంతో కొంత డిప్రెషన్ లోనే కనిపించాడు విజయ్. బట్ తిరిగి మళ్లీ ఫామ్ లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. బట్ ఇవేవీ అంత సులువుగా వర్కవుట్ కావడం లేదు. ముఖ్యంగా అతని తర్వాతి ప్రాజెక్ట్ విషయంలో కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతూనే ఉంది.


లైగర్ తర్వాత సమంతతో చేస్తోన్న ఖుషీ సినిమా ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆగింది. అందుకు కారణం సమంత అంటున్నారు. సమంతకేవో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనే రూమర్స్ వచ్చాయి ఆ మధ్య. అది నిజమా లేక ఇంకేదైనా కారణం ఉందా అనేది తెలియదు కానీ.. ప్రస్తుతం ఖుషీ చిత్రీకరణ చేయాలంటే సమంత రావాలి. తన కోసమే విజయ్ వెయిట్ చేస్తున్నాడు. మరోవైపు ఈ గ్యాప్ ను తన నెక్ట్స్ సెట్ చేసుకునేందుకు ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. ఆ క్రమంలో నెక్ట్స్ మూవీని దిల్ రాజు బ్యానర్ లో చేయాల్సి ఉంది. దీంతో విజయ్ మరీ ఎక్కువ టెన్షన్ ఉండదు. కథ, దర్శకుడిని దిల్ రాజే చూస్తాడు కాబట్టి విజయ్ రిలాక్స్ కావొచ్చు. కానీ ఆ ఛాన్స్ కూడా లేకండా మరో టెన్షన్ పెట్టేశాడు దిల్ రాజు.


ప్రస్తుతం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాను డైరెక్ట్ చేసి ఉన్న ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండను నటింప చేయాలనుకున్నాడు దిల్ రాజు. ఇంద్రగంటి కూడా ఓ సెన్సిబుల్ లవ్ స్టోరీని దిల్ రాజుకు చెప్పి ఉన్నాడట. అది విజయ్ కి సరిపోతుందని భావించారు.

అయితే ముందు ఇంద్రగంటి చేసిన సినిమా రిజల్ట్ తెలియాలి. అంటే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రిజల్ట్ పైనే ఈ కాంబినేషన్ ఆధారపడి ఉంది. ఓ రకంగా మొన్నటి వరకూ విజయ్ దేవరకొండకు దర్శకులు లేరు. ఉన్న దర్శకుడేమో సినిమా రిజల్ట్ కోసం చూస్తున్నాడు. మరి ఆ అమ్మాయి గురించి సూపర్ హిట్ అయితే పెద్దగా లేట్ లేకుండానే ఈ ఇంద్రగంటి, విజయ్ దేవరకొండ, దిల్ రాజు కాంబినేషన్ లో సినిమా అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు.

Related Posts