దసరాను డబ్బింగ్ సినిమాలకు ఇచ్చేస్తారా..?

దసరా వచ్చిందంటే చాలా పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటాయి. ఈ సారి కూడా ఆ సందడి ఉంది. కానీ ఇద్దరు వెటరన్ స్టార్స్ చిరంజీవి, నాగార్జున ఫైట్ లో ఉన్నారు. వారు కూడా ఈ ఫైట్ ఎందుకు అనుకుని కాస్త గ్యాప్ తీసుకున్నారు. వీరితో పాటు స్వాతిముత్యం అనే సినిమా దసరా రోజు విడుదలవుతోంది. ఇంకా కొన్ని సినిమాలు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ లోగానే రెండు డబ్బింగ్ సినిమాలు దసరా హాలిడేస్ ను గ్రాబ్ చేయడానికి వస్తున్నాయి. ఆ రెండు సినిమాలకూ తెలుగు నిర్మాతలే రెడ్ కార్పెట్ వేస్తుండటం విశేషం. దసరా టార్గెట్ గా తెలుగు మార్కెట్ పై కన్నేసి వస్తోంది మణిరత్నం పొన్నియన్ సెల్వన్1. చాలాయేళ్లుగా ఈ సినిమా చేయాలని చూస్తోన్న మణిరత్నం చివరికి పట్టాలెక్కించి పూర్తి చేశాడు.

తమిళనాడులోని చోళ రాజ్య స్థాపన, పరిపాలన, సంస్కరణలు వంటి అంశాలను కలిపి రెండు భాగాలుగా ఈ మూవీని తీయాలనుకున్నాడు మణిరత్నం. అందులో ఫస్ట్ పార్ట్ ఈ నెల 30న విడుదలవుతోంది.
విక్రమ్,