పంజా వైష్ణవ్ తేజ్ ,సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ చిత్రం
*’పంజా వైష్ణవ్ తేజ్ ‘ హీరోగా ‘శ్రీ లీల‘ నాయికగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం
* వైష్ణవ్ తేజ్ మాస్ అవతారం ఈ చిత్రం
*దర్శకుడు గా శ్రీకాంత్.ఎన్.రెడ్డి పరిచయం
*ముగింపు దశలో చిత్రం షూటింగ్
*ఆకట్టుకుంటున్న విడుదల తేదీ ప్రచార చిత్రం
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో రూపు దిద్దు కుంటున్న చిత్రం షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. శ్రీకాంత్.ఎన్.రెడ్డి దర్శకుడు గా ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. కథానాయికగా ‘శ్రీ లీల‘ నటిస్తున్న ఈ చిత్రాన్ని
నిర్మాతలు ఎస్. నాగవంశీ , సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర సమర్పకులు గా వ్యవహరిస్తున్నారు.
ఆంగ్ల సంవత్సరాది శుభ వేళ ఈ చిత్రానికి సంభందించి ఓ ప్రచార చిత్రాన్ని ఈరోజు విడుదల చేసింది చిత్ర యూనిట్. 29 ఏప్రిల్, 2023 న చిత్రం విడుదల అన్నది ఈ ప్రచార చిత్రం లో గమనించ వచ్చు. తీగల కంచె ఆవల అస్పష్టంగా కనిపిస్తూ కథానాయకుడు నిలుచున్న తీరు, మరో వైపు కంచె తగలబడుతున్న వైనం, ఆసక్తిని రేకెత్తిస్తూ, ఆకట్టుకుంటోంది ఈ విడుదల
తేదీ ప్రచార చిత్రం.
తొలిచిత్రం తోనే స్టార్ గా ప్రేక్షక హృదయాలలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అవతారం ఈ చిత్రం అనిపిస్తుంది. ఈ విషయాన్ని గతంలో
పౌరుషా నికి ప్రతీకగా విడుదల అయిన ప్రచార చిత్రం నిరూపించింది. అంతేకాదు భారీస్థాయిలో చిత్ర నిర్మాణం జరుగుతోంది.
వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అవతారం ఈ చిత్రం. పూరి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఈ చిత్రం అంటున్నారు చిత్ర దర్శక,నిర్మాతలు.
ఇప్పటికే చిత్రం చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. చిత్రం టైటిల్, అలాగే చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు
సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో మైలురాయిగా చెప్పుకునే చిత్రాల్లో 'అల్లూరి సీతారామరాజు' మొదటి వరుసలో నిలుస్తుంది. కృష్ణ నటించిన…
'పుష్ప' ఫ్రాంఛైజ్ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వాగ్ అయితే.. ఆ తర్వాత ప్రధానంగా…
The NTR-Prasanth Neel project is one of the upcoming crazy movies from the Indian film…
దర్శకధీరుడు రాజమౌళి సృష్టి 'బాహుబలి' సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సిరీస్ లో వచ్చిన 'బాహుబలి 1,…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. బాలీవుడ్ సెలబ్రిటీస్ ను బాగా ఆకట్టుకుంటున్నాడు. 'వార్ 2' కోసం ముంబైలో విహరిస్తున్న తారక్..…
ప్రత్యేకమైన రోజులను పురస్కరించుకుని సామాజిక మాధ్యమాల ద్వారా తన శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు మెగాస్టార్ చిరంజీవి. ఈరోజు (మే 1) కార్మిక…