మే నెలలో రంగరంగ వైభవంగా వైష్ణవ్

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ దూకుడుగా వెళున్నాడు. తొలి సినిమా ఉప్పెనతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న వైష్ణవ్ తర్వాత కొండపొలంతో నిరాశపడ్డా.. తర్వాతి సినిమాల విషయంలో ఆ ఎఫెక్ట్ పడకుండా చూసుకుంటున్నాడు. ప్రస్తుతం రంగరంగ వైభవంగా అనే చిత్రంతో రాబోతోన్నాడు. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసింది టీమ్. మరి ఈ రంగరంగ వైభవం ఎప్పుడు జరగబోతోందో తెలుసా..?
ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ అనేది రేర్ గా జరుగుతుంది. ఆ విషయంలో వైష్ణవ్ తేజ్ చాలా లక్కీ. సినిమా విడుదలకు ఏకంగా యేడాది ఆలస్యమైనా అనుకున్న విజయం మాత్రం ఆగలేదు. ఓ ప్రయోగంలాంటి కథగా చెప్పుకునే ఉప్పెనతో వచ్చిన కలెక్షన్స్ పరంగానూ టైటిల్ ను తలపించారు. కృతిశెట్టి హీరోయిన్ గా పరిచయం అయిన ఉప్పెన వైష్ణవ్ కు టాలీవుడ్ లో ది బెస్ట్ లాంచింగ్ గా మారింది. నటన పరంగానూ మొదటి సినిమాకే ఆకట్టుకోవడంతో తనకు తెలుగు సినిమా పరిశ్రమలో మంచి స్థానం వస్తుందని చాలామంది భావించారు.
ఇక రెండో సినిమాగా వచ్చిన కొండపొలం కమర్షియల్ గా ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయినా.. వైష్ణవ్ కు మంచి పేరు తెచ్చింది. తర్వాత తెలుగులో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డిని తమిళ్ లో తెరకెక్కించి అక్కడా మంచి విజయం అందుకున్న గిరీశయ్య దర్శకత్వంలో ఇప్పుడు రంగరంగ వైభవం సినిమాతో వస్తున్నాడు. కేతికశర్మ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ టైటిల్ కు మంచి అప్లాజ్ వచ్చింది. ఈ మూవీ నుంచి రీసెంట్ గా విడుదల చేసిన సాంగ్ కూడా సూపర్ అనిపించుకుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతంలో శంకర్ మహదేవన్ గాత్రంలో మెస్మరైజింగ్ గా ఉందా పాట.
ప్రస్తుతానికి పూర్తి పాజిటివ్ బజ్ తోనే ఉన్న రంగరంగవైభవం చిత్ర రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసింది టీమ్. ప్రస్తుతం సమ్మర్ అంతా చాలా పెద్ద సినిమాలతో ఫుల్ ప్యాక్ అయి ఉంది. దీంతో తను మరీ పెద్దవాళ్లతో పోటీ పడకుండా వాళ్లంతా వచ్చి వెళ్లాక డేట్ సెట్ చేసుకున్నారు. మే 27న తమ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఓ రకంగా అన్ని పరీక్షలు అయిపోయిన టైమ్ అవుతుంది. సినిమాకు ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా సూపర్ హిట్ గా మారడానికి పెద్ద టైమ్ పట్టదు. సో.. మే చివరి వారంలో వైష్ణవ్, కేతికల ప్రేమకథ థియేటర్స్ లో రంగరంగ వైభవంగా జరగబోతోందన్నమాట.

Related Posts