మెగా కాంపౌండ్ అయిన అల్లు అరవింద్ ఆహా కోసం నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ అంటూ టాక్ షో చేయడం ఓ సంచలనం అయితే.. ఈ టాక్ షో సూపర్ సక్సస్ అవ్వడం మరో సంచలనం. అయితే.. బాలయ్య ఈ టాక్ షో చేస్తారని ప్రకటించినప్పటి నుంచి ఫస్ట్ ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వస్తారని వార్తలు వచ్చాయి. చిరును బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడగనున్నారు.? వాళ్లిద్దరి మధ్య మాటల్లో ఎలాంటి ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తాయి..? అని అటు మెగా అభిమానులు ఇటు నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురు చూశారు.
అయితే.. ఫస్ట్ ఎపిసోడ్ ను కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో చేయడం జరిగింది. మరి.. లాస్ట్ ఎపిసోడ్ అయినా చిరంజీవితో చేసి ఎండ్ చేస్తారనుకుంటే… మహేష్ బాబుతో చేయడం జరిగింది. దీంతో చిరంజీవిని ఎందుకు ఈ షోకు గెస్ట్ గా రాలేదు అనేది ఆసక్తిగా మారింది. దీని గురించి షో లో ప్రధాన బాధ్యతలను నిర్వర్తించిన బీవీయస్ రవి వివరణ ఇచ్చారు. ఇంతకీ బివీయస్ రవి ఏం చెప్పారంటే.. అప్పటికే సమంత నిర్వహించిన సామ్ జామ్ టాక్ షో కు చిరంజీవి పాల్గొన్నప్పటికీ.. మరోసారి ఆయన్ని బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో లోనూ పార్టిసిపేట్ చేయించాలని తామంతా గట్టిగా అనుకున్నామని అన్నారు.
అయితే… రెండు ఎపిసోడ్స్ పూర్తి అయిన తర్వాత బాలకృష్ణ భుజానికి ఆపరేషన్ జరగడంతో కొన్ని వారాలు షో కు, షూటింగ్ కు బ్రేక్ పడింది. ఆ సమయంలో నిజానికి చిరంజీవి డేట్స్ ఇచ్చారని, కానీ వాటిని తాము ఉపయోగించుకోలేక పోయామని బివీయస్ రవి అన్నారు. ఆ తర్వాత చిరంజీవి గాడ్ ఫాదర్, భోళాశంకర్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే చిత్రాల షూటింగ్స్ మొదలు కావడంతో చిరంజీవి టైమ్ ఇవ్వలేకపోయారని చెప్పారు. అయితే.. అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ లో బాలకృష్ణ – చిరంజీవి కాంబో లో స్పెషల్ ఎపిసోడ్ చేయాలని తాను కోరుకుంటున్నానని బీవీయస్ రవి అన్నారు. మరి.. సెకండ్ సీజన్ లో అయినా చిరు, బాలయ్యల అన్ స్టాపబుల్ ఎపిసోడ్ వస్తుదని ఆశిద్దాం.
ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ వరించింది. దేశంలోనే రెండో…
ప్రస్తుతం మన స్టార్ హీరోలంతా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకేసారి రెండేసి సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ…
సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మాత్రమే కాదు.. అప్పుడప్పుడూ వాయిస్ ఓవర్ తోనూ ఆడియన్స్…
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో బ్యాక్ టు…
బాలీవుడ్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక సతమతమైన హిందీ చిత్ర పరిశ్రమ.. గత ఏడాది…
దాదాపు 37 ఏళ్ల తర్వాత విశ్వ నటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం…