పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ప్రభాస్, పూజా హేగ్డే జంటగా నటించిన ఈ భారీ పిరియాడిక్ లవ్ స్టోరీని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయాలి అనుకున్నారు. అయితే.. కరోనా కేసులు పెరుగుతుండడం వలన రాధేశ్యామ్ వాయిదా పడింది. ఈ క్రేజీ మూవీ గురించి అభిమానులు ఎప్పటి నుంచో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి వస్తుంది అనుకుంటే.. వాయిదా పడింది.
మరి.. న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే.. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ కి సంబంధించి ఆసక్తికర టాక్ ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తుంది. ఈ సినిమాని మేకర్స్ వచ్చే మార్చ్ నెలలో రిలీజ్ చెయ్యాలని భావిస్తున్నారట. మార్చ్ 18వ తేదీ ప్రస్తుతానికి పరిశీలిస్తున్నారని అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. ఈ డేట్ నే లాక్ చేస్తారు అంటున్నారు. అయితే.. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో మార్చి నెలకి పరిస్థితి ఎలా ఉంటుందో అనేది ఆసక్తిగా మారింది.
మరో వైపు ఫిబ్రవరి నెలలో రిలీజ్ కావాల్సిన ఆచార్య, మేజర్, భీమ్లా నాయక్.. చిత్రాలు రిలీజ్ అవుతాయా..? ఇవి కూడా వాయిదా పడతాయా..? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మరి.. ఏం జరగనుందో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.