శ్యామ్ సింగరాయ్ సెన్సార్ పూర్తి

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగరాయ్ సెన్సార్ పూర్తయింది. కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ ఫిక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ డైరెక్టర్. సాయి పల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా నటించారు. మడోన్నా సెబాస్టియన్ ఓ కీలక పాత్ర చేసింది. నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన మొదటి చిత్రం ఇది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. రెండు భిన్నమైన పాత్రల్లో నాని ట్రాన్సర్ఫేషన్ ఆకట్టుకుంది. 1970ల కాలంలో సాగే కథలో నానికి జోడీగా సాయి పల్లవి నటించింది. ఆమె దేవదాసినీ పాత్రలో కనిపించడం విశేషం. ఇక ఈ కాలంలో సాగే కథలో నానికి జోడీగా కృతిశెట్టి నటించింది. అయితే ఈ ఇద్దరి మధ్య ఓ ఇంటిమేట్ సీన్ ఉన్నట్టుగా ట్రైలర్ లో కనిపించడం ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచింది.


క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 24న విడుదల కాబోతోన్న శ్యామ్ సింగరాయ్ కి సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. మామూలుగా నాని సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్సెస్ కు ఎక్కువ ఇష్టం. అయితే ఈ సారి కాస్త యాక్షన్ ఎపిసోడ్స్ కూడా పెంచినట్టున్నారు. అలాగే కృతిశెట్టి ఎపిసోడ్స్ వల్ల కూడా యూ/ఏ సర్టిఫికెట్ వచ్చి ఉండవచ్చు. మొత్తంగా ప్యాన్ ఇండియన్ రేంజ్ లో విడుదల కాబోతోన్న ఈచిత్రానికి ప్రమోషన్స్ ను కూడా ఆ రేంజ్ లో చేస్తోంది టీమ్. ఇప్పటికే తెలుగుతో పాటు బెంగళూరు, చెన్నైలలో ప్రమోషన్స్ ను చేస్తున్నారు. త్వరలోనే ముంబై కూడా వెళతారేమో. కొన్నాళ్లుగా నానికి సరైన హిట్ లేదు. మరి ఈ శ్యామ్ సింగరాయ్ అయినా సాలిడ్ హిట్ గా నిలుస్తుందేమో చూడాలి.

Related Posts