రాధేశ్యామ్ నుంచి బిగ్ న్యూస్

ఇండియాస్ టాప్ స్టార్ ప్రభాస్ మూవీ రాధేశ్యామ్ నుంచి బిగ్ న్యూస్ అనౌన్స్ అయింది. ఇది ఫ్యాన్స్ కు ఖచ్చితంగా ఫీస్ట్ లాంటి న్యూసే. రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా వెలుగుతోన్న పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఫినిష్ చేసుకుని సంక్రాంతి బరిలో జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది రాధేశ్యామ్.
ఇక ఈసినిమా నుంచి ఇప్పటి వరకూ వచ్చిన పాటలు ఆకట్టుకున్నాయి. కాకపోతే అంచనాలను అందుకోలేదనే చెప్పాలి. అయినా కొన్ని పాటలు ఆడియోగా కాంటే వీడియోస్ గానే మెప్పిస్తాయి. రాధేశ్యామ్ పాటలు కూడా ఆ కోవలోనే ఉంటాయనుకోవచ్చు. చాలా అవాంతరాలు, దాటుకుని రాబోతోన్న రాధేశ్యామ్ ట్రైలర్ ను ఈ నెల 23న విడుదల చేయబోతున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించబోతున్నామని మూవీ టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. మరి ఈ ట్రైలర్ తో రాధేశ్యామ్ పై అంచనాలు పెరుగుతాయా లేదా అనేది తేలిపోతుంది. ఏదేమైనా ఎందుకో ఈ సినిమా ముందు నుంచీ ఆడియన్సెస్ అటెన్షన్ ను ఎక్కువగా డ్రా చేయడంలో విఫలమవుతోంది. దాన్ని అధిగమించేలా ట్రైలర్ కనిపిస్తే ఇక ఫ్యాన్స్ వారి రచ్చ మొదలుపెడతారు.

Related Posts