నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగ రాయ్. ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించారు. దాదాపు రెండేళ్ల తర్వాత నాని నటించిన సినిమా థియేటర్లోకి రావడంతో ఆశించిన విజయం అందుకున్నారు. రెగ్యులర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా రూపొందిన శ్యామ్ సింగ రాయ్ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజైంది. అక్కడ కూడా ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది.
అయితే.. ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతుండడంతో శ్యామ్ సింగ రాయ్ చిత్రం ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపద్యంలో శ్యామ్ సింగ రాయ్ ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ వచ్చింది. ఓటీటీ ప్లాట్ పామ్ నెట్ ఫ్లిక్స్ లో జనవరి 21న శ్యామ్ సింగ రాయ్ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇందులో నాని రెండు విభిన్న పాత్రల్లో నటించారు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా కథానాయికలు.
క్రిస్మస్ కానుకగా థియేటర్లో రిలీజ్ అయిన శ్యామ్ సింగ రాయ్ చిత్రం సంక్రాంతి తర్వాత 21న ఓటీటీలో రిలీజ్ కానుంది. మరి.. థియేటర్లో సక్సస్ సాధించిన శ్యామ్ సింగ రాయ్ ఓటీటీలో ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.
Megastar Chiranjeevi was awarded the Padma Vibhushan in the Padma Awards announced on the occasion…
It is known that rowdy star Vijay Devarakonda is doing a film with Gautham Tinnanuri.…
'ఫ్యామిలీ స్టార్' తర్వాత మళ్లీ దిల్రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'రాజావారు రాణిగారు' ఫేమ్…
వచ్చిన ఆఫర్స్ అన్నీ ఒప్పుకోకుండా.. సెలక్టివ్ గా సినిమాలు చేసే ముద్దుగుమ్మ సాయిపల్లవి. హీరోయిన్ గా అగ్రపథాన దూసుకెళుతోన్న సమయంలోనే…
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోస్ లో 80 నుంచి 90 శాతం మంది వారసత్వంగా వచ్చినవారే. అంతటి…
ప్రస్తుతం జోరుగా సాగుతోన్న రీ రిలీజుల ట్రెండ్ లో విక్రమ్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ 'అపరిచితుడు' కూడా చేరింది.…