కరోనా కారణంగా అన్ని సినిమాలూ వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే చాలామంది రిలీజ్ డేట్స్ రెండు మూడుసార్లు పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఖచ్చితంగా వస్తాయి అనుకున్న దశ నుంచి కూడా అవుట్ అయిపోయిన సినిమాలూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఉన్న సినిమా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్. ఎప్పుడో వస్తుందనుకున్న ఈ చిత్రం చివరికి ఈ సంక్రాంతికి వస్తుంది అని చెప్పారు. బట్.. చివరి నిమిషంలో వీళ్లూ పోస్ట్ పోన్ చేశారు. చాలా రాష్ట్రాల్లో థియేటర్స్ లో 50శాతం ఆక్యుపెన్సీ నిబంధన విధించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు మేకర్స్. వీరికంటే ముందే ఆర్ఆర్ఆర్ కూడా వాయిదా పడింది. ఆ సినిమా మళ్లీ ఎప్పుడు విడదలవుతుందో చెప్పలేం కానీ.. రాధేశ్యామ్ ను మాత్రం మార్చి 18న విడుదల చేస్తాం అని ప్రకటించారు. అప్పటికి పెద్ద సినిమాలేం లేవు. కానీ లేటెస్ట్ గా డార్లింగ్ స్టార్ కుపోటీ ఇస్తూ బచ్చన్ పాండే కొత్త నిర్ణయం తీసుకున్నాడు.
అక్షయ్ కుమార్ కొత్త సినిమా బచ్చన్ పాండే. ఓ రకంగా చెబితే ఇది కూడా రాధేశ్యామ్ లాంటిదే. చిత్రీకరణ పరంగా రాధేశ్యామ్ కుఏ మాత్రం తీసిపోకుండా యేళ్ల తరబడి షూట్ చేశారు. ఇంకా చెబితే షూటింగ్ మొదలైనప్పుడు ఈ మూవీనిని 2020 డిసెంబర్ లో విడుదల చేస్తాం అన్నారు. తర్వాత 2021 జనవరి అన్నారు. అదీ పోయింది సో.. యేడాదిన్నర ఆలస్యం అయింది. ఇటు రాధేశ్యామ్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. వాళ్లూ అంతే. ఎప్పుడు వస్తారో చెప్పకుండానే అభిమానులను ఎంతో ఇబ్బంది పెట్టారు. మొత్తంగా దాదాపు ఒకే తరహాలో ఉన్న ఈ రెండు సినిమాలూ ఒకే రోజు విడుదల కాబోతున్నాయి.
యస్.. మామూలుగా ఒక పెద్ద సినిమా ఉన్నప్పుడు అదే రోజు మరో పెద్ద సినిమాను విడుదల చేయడం లేదీ మధ్య. అయినా ఆ ట్రెండ్ ను కాదని రాధేశ్యామ్ రిలీజ్ రోజునే బచ్చన్ పాండేను విడుదల చేయబోతున్నట్టు ఈ మూవీ టీమ్ లేటెస్ట్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. దీంతో ఈ రెండు బిగ్ మూవీస్ మధ్య నార్త్ లో పెద్ద వార్ తప్పదు అనుకోవచ్చు. నిజానికి ఇప్పుడు ప్రభాస్ కు నార్త్ లో తిరుగులేని క్రేజ్ ఉంది. ఇటు సౌత్ లో అక్షయ్ క్రేజ్ అంతంత మాత్రమే. అంచేత రాధేశ్యామ్ తో తలపడితే బచ్చన్ పాండేకే ప్రాబ్లమ్ అవుతుంది. అది తెలుసుకుని ఆగుతారా లేక.. రాధేశ్యామ్ తో తలపడతారా అనేది చూడాలి.
Support for Janasena chief Pawan Kalyan is increasing from the film industry. Many big screen…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి సినీ పరిశ్రమ నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పవన్ కోసం పిఠాపురంలో ప్రత్యక్షంగా…
మే 3న థియేటర్లలో సినిమాల జాతర ఉండబోతుంది. తెలుగు నుంచి మూడు సినిమాలు.. అనువాద రూపంలో మరొకటి కలిపి నాలుగు…
There will be a film fair in theaters on May 3. Three films from Telugu..…
After 'Hanuman' became a blockbuster, the expectations for the sequel 'Jai Hanuman' have increased. Director…
'హనుమాన్' బ్లాక్బస్టర్ సాధించడంతో సీక్వెల్ 'జై హనుమాన్'పై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్…