రేణు దేశాయ్, అఖిరాకు కరోనా

థర్ట్ వేవ్ సాధారణ ప్రజానీకంతో పాటు చిత్ర పరిశ్రమను చుట్టేస్తోంది. ఫస్ట్ సెకండ్ వేవ్ లో వైరస్ బారి నుంచి తప్పించుకున్న సెలబ్రిటీలు కొత్తగా కరోనా బారిన పడుతుండగా…అప్పటికే ఒకట్రెండు సార్లు కరోనా వచ్చిన తారలకూ వైరస్ సోకుతోంది. ఇటీవల హీరో మహేష్ బాబు, థమన్, రాజేంద్రప్రసాద్, బండ్ల గణేష్, ఖుష్బూ, శోభన కరోనా బారిన పడ్డారు. తాజాగా నటి, దర్శకురాలు, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కి కోవిడ్ సోకింది. ఆమెతో పాటు కొడుకు అఖిరా కూడా కరోనా బారిన పడ్డారు. వీళ్లిద్దరూ ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా రేణు దేశాయ్ తెలిపారు.

ఆమె తాజా ఇన్ స్టా పోస్టులో స్పందిస్తూ…కొద్ది రోజుల క్రితమే నాకూ, అఖిరాకు కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ గా వచ్చింది. ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నాం. ఇద్దరికీ బాగానే ఉంది. గతేడాది నేను రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాను. ఈ మధ్యే అఖిరాకు కూడా కోవిడ్ వ్యాక్సిన్ వేయిద్దామని అనుకున్నాను. ఇంతలో వైరస్ సోకింది. అని పేర్కొన్నారు రేణు.

Related Posts