రష్మికకు షాక్ ఇచ్చిన బాలీవుడ్

తెలుగులో టాప్ హీరోయిన్ అనిపించుకున్న చాలామంది భామలు మళ్లీ బాలీవుడ్ లోనూ జెండా ఎగరేయాలనే ప్రయత్నాలు చేస్తారు. అందులో సక్సెస్ అయ్యేది కొందరే. ఆ కొందరు కూడా ఆ ఏరియాస్ నుంచి వచ్చినవాళ్లే ఉంటారు. అయినా తెలుగులో టాప్ లేపిన నార్త్ బ్యూటీస్ మళ్లీ బాలీవుడ్ లో సత్తా చాటిన దాఖలాలు లేవు. కానీ అప్పట్లో వహీదా రెహ్మాన్, రేఖ, జయప్రద, శ్రీదేవి వంటి సౌత్ బ్యూటీస్ బాలీవుడ్ ను షేక్ చేశారు. అలా తను కూడా చేయాలనుకుని బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంది రష్మిక మందన్నా. ఎవరూ ఊహించని విధంగా వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు చేసింది.

అందులో మొదటిది అమితాబ్ బచ్చన్ తో నటించిన గూడ్ బై. బట్ ఈ మూవీని ఎవరూ పట్టించుకోలేదు. అందుకు కారణం ఓటిటిలో రావడమే. ఏ మాత్రం బజ్ లేకుండా స్ట్రీమ్ అయిన ఈ చిత్రంతో రష్మిక కూడా బాలీవుడ్ కు గుడ్ బై చెబుతుంది అనే సెటైర్స్ కూడా పడ్డాయి. అయితే సిద్ధార్థ్ మల్హోత్రాతో నటించిన మిషన్ మజ్ను తన కోరిక నెరవేరుస్తుందని బోలెడు ఆశలు పెట్టుకుంది. వాటిపైనా నీటిని చల్లింది బాలీవుడ్.


మిషన్ మజ్ను చిత్రాన్ని థియేటర్స్ లోనే విడుదల చేయాలనుకున్నారు. జనవరి 20 అని డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. బట్.. ఇప్పుడు వారు మనసు మార్చుకున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటిటిలోనే విడుదల చేయబోతున్నారు. ఇది రష్మిక మందన్నాకు ఊహించని షాక్ అనే చెప్పాలి. నిజానికి అంత పెద్ద పరిశ్రమలో పరిచయం అవుతున్నప్పుడు వెండితెరపై కనిపిస్తేనే ఆడియన్స్ కు రిజస్టర్ అవుతుంది. ఇలా బుల్లితెరపై ఇంట్లో కూర్చుని చూస్తే ఎవరు పట్టించుకుంటారు..?


ఇక ఇప్పుడు రష్మిక మందన్నా చేతిలో రణ్‌ బీర్ కపూర్ తో నటిస్తోన్న యానిమల్ ఉంది. ఈ చిత్రానికి అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. ఆల్రెడీ అతను ఈ అర్జున్ రెడ్డిని అక్కడ కబీర్ సింగ్ గా రీమేక్ చేసి బిగ్గెస్ట్ హిట్ కొట్టి ఉన్నాడు. అందుకే ఈ చిత్రంపై అంచనాలున్నాయి. ఏదేమైనా రష్మిక మందన్నాకు వరుసగా రెండు సినిమాలు షాక్ ఇచ్చాయనే చెప్పాలి.

Telugu 70mm

Recent Posts

Twenty years of Sukumar’s film career

Every director has a style. Not everyone will like it. But.. there are some directors..…

42 mins ago

సందీప్ కిషన్ ‘ప్రాజెక్ట్ జెడ్‘కి సీక్వెల్ గా ‘మాయా వన్‘

జయాపజయాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ వైవిధ్యభరిత సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేస్తుంటాడు యంగ్ హీరో సందీప్ కిషన్. ఈ…

50 mins ago

The first single from ‘Devara’ is coming..!

Man of masses NTR most awaited movie 'Devara'. The first part of this high voltage…

52 mins ago

Hero Nani supports Pawan Kalyan

Pawan Kalyan, who is contesting in the upcoming elections, is not only supported by mega…

58 mins ago

‘దేవర‘ నుంచి ఫస్ట్ సింగిల్ వస్తోంది..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ మూవీ ‘దేవర‘. రెండు భాగాలుగా రెడీ అవుతోన్న ఈ హై వోల్టేజ్…

1 hour ago

Chiranjeevi’s appeal to Pithapuram reality

Megastar Chiranjeevi expressed full support to the Janasena party founded by Pawan Kalyan. Chiranjeevi donated…

1 hour ago