అంచనాలు పెంచిన విరాట పర్వం మూవీ..

టాలీవుడ్ లో రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాల్లో మెస్ట్ ప్రామిసింగ్ మూవీగా పేరున్న చిత్రం విరాట పర్వం. చాలా రోజుల క్రితమే కంప్లీట్ అయిన విరాట పర్వం ఫైనల్ గా ఈ నెల 17న విడుదలకు రెడీ అయ్యింది. రానా, సాయిపల్లవి కాంబోలో వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నక్సల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ఇప్పటికే పాటలు, టీజర్లతో ఆడియన్స్ లో విరాట పర్వంపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇక నిన్న రిలీజైన ధియేట్రికల్ అంచనాలను పెంచుతోంది.

విరాట పర్వం ఈ నెల 17న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. వేణు ఊడుగుల దర్శకత్వంలో సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. రానా, సాయిపల్లవి జంటగా నటించిన ఈ మూవీలో టాలెంటెడ్ యాక్ట్రెసెస్ నందితా దాస్, ప్రియమణి, నివేదా పేతురాజ్, ఈశ్వరీ రావ్ తో పాటు నవీన్ చంద్ర కూడా కీలక పాత్రలో నటించాడు. సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది.
1990ల నాటి వాస్తవ సంఘటనల నుంచి ప్రేరణ పొందిన విరాట పర్వం సినిమా… యుద్దం నేపథ్యంలో సాగే అద్భుతమైన ప్రేమకథా చిత్రంగా చెబుతున్నారు మేకర్స్. ముఖ్యంగా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ సాగుతుంది. రానా రవన్న అనే పాత్రలో నటించాడు. తన కలం పేరు అరణ్యతో రచనలు చేసి ప్రజల్లో చైతన్యం కలిగిస్తుంటాడు. అతన్ని ఆరాధించే వెన్నెల పాత్రలో సాయిపల్లవి నటించింది.

విరాట పర్వం ట్రైలర్ ని నిన్న కర్నూలులో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. టేకింగ్, డైలాగ్స్, విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇలా అన్ని రకాలుగా ట్రైలర్ కి హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ వచ్చాక విరాట పర్వంపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక సురేష్ బొబ్బిలి మ్యూజిక్ ఇచ్చిన పాటలు ఆల్ రెడీ సక్సెస్ అయ్యాయి. మరి విరాట పర్వం బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

Related Posts