త్రివిక్రమ్ శ్రీనివాస్ బలహీనత అందరికీ తెలిసిపోతుందా

త్రివిక్రమ్ శ్రీనివాస్ .. టాప్ తెలుగు డైరెక్టర్ గా తిరుగులేని స్థానంలో ఉన్నాడు. అందరు టాప్ హీరోస్ తోనూ పని చేసాడు. హారిక హాసిని బ్యానర్ కు ఆయనో పెద్ద ఎసెట్ అనేది అందరికి తెలుసు. మాటల మాంత్రికుడిగా వెండితెరపై మాయాజాలం చేస్తుంటాడు. కానీ అతనిలో ఒక పెద్ద బలహీనత ఉంది. దాన్ని కవర్ చేయడానికే మాటలతో మాయ చేస్తుంటాడు. ఎస్ త్రివిక్రమ్ మాటలు చెప్పినంత సులువుగా కథలు చెప్పలేడు. అన్ని కథల్లోనూ ఆ బలహీనత కనిపిస్తుంది. ఒక చిన్న పాయింట్ పట్టుకుని దానికి తనదైన మాటలతో మాయ చేస్తుంటాడు. దీంతో అతని చాల సినిమాల్లోని కథలోపలి మాటల్లో కొట్టుకుపోతుంటాయి. బట్ అన్నిసార్లు కవర్ చేయలేరు కదా..? అందుకే ఇప్పుడు స్టార్ హీరోలని మెప్పించల్క పోతున్నాడు. ఆ మధ్య ఎన్ఠీఆర్ కు చెప్పిన కథ అతనికి నచ్చలేదు. దీంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఎన్టీఆర్ వేరే డైరెక్టర్స్ ని చూసుకున్నాడు. దీంతో త్రివిక్రమ్ తర్వాత మహేష్ బాబు మూవీకి రెడీ అయ్యాడు.

ఐతే త్రివిక్రమ్ బలహీనత మరోసారి బయట పడుతోంది. మహేష్ ను కూడా తన కథతో మెప్పించలేకపోతున్నాడు. ఇప్పటికే రెండు మూడు కథలు చెప్పాడు త్రివిక్రమ్. కానీ అవేవీ మహేష్ కు నచ్చడం లేదు.. ఈ క్రమంలో వేరే దేశం వెళ్లి మరీ కథ చర్చలు చేస్తున్నారు. నిజానికి ఆలా వైకుంఠపురములో మూవీ తర్వాత త్రివిక్రమ్ కు చాలా టైం వచ్చింది. ఆ టైం ను కూడా పవన్ కళ్యాణ్ కోసం కేటాయించడం వల్లే ఇలా ఐంది అంటున్నారు.మహేష్ కి చెప్పిన ఒక లైన్ మాత్రం ఒకే అయ్యిందట. ఇప్పుడు దానిపై వర్క్ చేస్తూనే షూటింగ్ వెళ్ళబోతున్నారు అని చెబుతున్నారు.

ఒక మంచి పరిణామం ఏంటంటే మహా స్టార్స్ ఇప్పుడు బలమైన కథలు లేకపోతె ఒప్పుకోవడం లేదు. దేశ వ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ అంత ఇప్పుడు తెలుగు సినిమా వైపు చూస్తున్నారు. అందుకే మనవాళ్లంతా మంచి కథకే మా ఓటు అంటూ ఖచ్చితంగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే హీరోల ఇమేజ్ లతో ఎదో ఒక చిన్న పాయింట్ తో పని కానిద్దాం అనుకునే దర్శకులకు షాక్ తప్పడం లేదు. అసలు త్రివిక్రమ్ సినిమాల్లో బలమైన కథలు వెతకడం కూడా తప్పే. ఏదేమైనా పన్నెండేళ్ల తర్వాత వస్తోన్న ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలున్నాయి. వాటిని అందుకువడం త్రివిక్రమ్ కు అంత సులువు కాదు. ఏదైనా తేడా వస్తే ఇతర స్టార్స్ కూడా త్రివిక్రమ్ అంటే భయపడతారు.

Related Posts