స్పీడ్ పెంచిన రౌడీ హీరో, పూరీ జగన్నాధ్ డైరెక్టర్..

పూరీ జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కిన లైగర్ మూవీ పాన్ ఇండియా లెవల్లో ఆగష్టులో విడుదలవుతోంది. ఆ సినిమా రాకముందే మళ్ళీ వీరిద్దరూ కలసి జనగణమన అనే పేరుతో సినిమాని అనౌన్స్ చేశారు. ఆ సినిమా షూటింగ్ నిన్న స్టార్ట్ అయ్యింది. ఇది కూడా పాన్ ఇండియా రేంజ్ మూవీనే. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా పూజా హెగ్డేని తీసుకున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కిన లైగర్ మూవీ ఆగష్టులో రిలీజ్ కాబోతుంది. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాపై పాన్ ఇండియా లెవల్లో మంచి అంచనాలున్నాయి. టీజర్ వచ్చాక లైగర్ పై బజ్ పెరిగింది.
లైగర్ కంప్లీట్ అయ్యిందో లేదో…

పూరీ, విజయ్ దేవరకొండ కలసి మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. ఆ సినిమానే జనగణమన. పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఈ సినిమాకి పూరీ, ఛార్మీతో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. జనగణమన మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. జనగణమనలో విజయ్ దేవరకొండకి జోడీగా పూజా హెగ్డేని తీసుకున్నారు మేకర్స్. పూజా కూడా షూటింగ్ లో అడుగుపెట్టింది. ఈ సినిమా కోసం దాదాపు 45 రోజుల డేట్స్ ని కేటాయించిందని తెలుస్తోంది. రెమ్యునరేషన్ కూడా చాలా ఎక్కువ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇందులో విజయ్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. సినిమాని వచ్చే ఏడాది ఆగష్టులో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Related Posts