రామ్ కు ఎవరూ లేరా..?

సీతారామమ్.. యుద్ధంతో రాసిన ప్రేమకథ అంటూ వస్తోన్న చిత్రం. సెన్సిబుల్ లవ్ స్టోరీస్ ను బాగా హ్యాండిల్ చేస్తాడు అన్న పేరున్న దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న చిత్రం ఇది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో మళయాల స్టార్ దుల్కర్ సాల్మన్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా రష్మిక మందన్నా ఓ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ విడుదల చేశారు. ముందు నుంచీ ఈ మూవీ గురించి టాలీవుడ్ లో కంప్లీట్ పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. పైగా దుల్కర్ తెలుగులో నటిస్తోన్న ఈ ఫస్ట్ మూవీ కథ విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకుని ఉంటాడు. బలమైన కంటెంట్ లేకుండా ఏ భాషలోనూ సినిమాకు కమిట్ కాడు దుల్కర్. అందుకే సీతారామమ్ గ్యారెంటీ హిట్అనే ముద్ర వేసుకుంది. ఆ విషయం ఈ టీజర్ చూస్తే సులువుగానే అర్థం అవుతుంది.అనాథ అయినా లెఫ్టినెంట్ రామ్ ఆర్మీలో పనిచేస్తుంటాడు. ఆ విషయం తెలిసిన ఒక వ్యక్తి వాయిస్(రోహిణి) ఓవర్ తో మొదలైన టీజర్ తర్వాత కొత్త మలుపు తీసుకుంది. ఎవరూ లేని రామ్ కు వరుసగా ఉత్తరాలు వస్తుంటాయి.

పైగా ఆ ఉత్తరాల్లోని యువతి తను అతనికి భార్యగా చెప్పుకుంటూ అలాగే సంబోదిస్తూ.. ఉత్తరాలు రాస్తూ ఉంటుంది. మరి ఈవిడను రామ్ ఎలా కనిపెట్టాడు. రామ్ కు మాత్రమే తను అలా లెటర్స్ ఎందుకు రాస్తుంది అనేది కథలా కనిపిస్తోంది. అన్నట్టు ఈ స్టోరీ 1965 నేపథ్యంలో పీరియాడిక్ స్టోరీగా వస్తోంది.కొన్ని కథలు వెంటాడతాయి. వెండితెరపై చూసినా మన ముందే జరిగినట్టుగానో.. లేక మనకు బాగా తెలిసినట్టుగానో అనిపిస్తాయి. అలాంటి కథలు అత్యంత అరుదుగా వస్తుంటాయి. అలాంటి సినిమానే ఇది కూడా అనిపించేలా లేటెస్ట్ గా విడుదలైన సీతారామమ్ మూవీ టీజర్ చూస్తే తెలుస్తుంది. హృద్యమైన కథలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ కథల్లో ఇవి బాగా వర్కవుట్ అవుతాయి. ఇక టీజర్ లో రష్మిక క్యారెక్టర్ ను రివీల్ చేయలేదు. కానీ తన పాత్రే సినిమాకు కీలకం అనేదిముందు నుంచీ చెబుతున్నారు. అది ఎంత కీలకం.. ఎలా కీలకం నేది సినిమా చూస్తే కానీ తెలియదు. ఇక ఈ చిత్రాన్ని ఆగస్ట్ 5న విడుదల చేస్తున్నట్టు ఇంతకు ముందే ప్రకటించారు. మొత్తంగా సీతారామమ్ టీజర్ తో మూవీ టీమ్ మంచి ఇంప్రెషన్ వేసిందనే చెప్పాలి.

Related Posts