సీజేఐ కి ఘన స్వాగతం పలికిన జయ్ తాలూరి

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ ఉదయం న్యూయర్క్‌ విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. భారత్‌ బయోటెక్ అధినేత కృష్ణ ఎల్లా, ఎండీ సుచిత్రా ఎల్లా, భారత కాన్సులెట్ జనరల్ రణ్‌ధీర్ జైశ్వాల్, తానా పూర్వ అధ్యక్షుడు జయ్ తాళ్లూరి, తాన ప్రముఖులు వలివేటి బ్రహ్మాజీ, వాసిరెడ్డి వంశీ, అరవింద్ తదితరులు చీఫ్ జస్టిస్‌ రమణకు స్వాగతం పలికారు. ఈ నెల 24న న్యూజెర్సీలో జరిగే తెలుగు కమ్యూనిటీ ఆఫ్‌ నార్త్‌ అమెరికా, 25న వర్జీనియాలో తెలుగు కమ్యూనిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ డీసీ ఆధ్వర్యంలో జరిగే మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. జులై 1న సీజేఐ గౌరవార్థం మిల్పిటాస్‌లో అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండో అమెరికన్స్‌ ఏర్పాటుచేసిన సభలో పాల్గొని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

Related Posts