‘పుష్ప 3’.. రైజ్, రూల్ ఆ తర్వాత రోర్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ‘పుష్ప’ ఫ్రాంచైస్ విషయంలో తగ్గేదే లే అంటున్నారు. ఈ సిరీస్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఇప్పటికే ‘పుష్ప’ పార్ట్ 1.. ది రైజ్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇప్పుడు పార్ట్ 2 ది రూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ‘పుష్ప.. ది రూల్’తో బన్నీ మరోసారి బాక్సాఫీస్ ను రూల్ చేయడం ఖాయమనే సంకేతాలైతే అందుతున్నాయి.

అయితే.. రెండు భాగాలతో పుష్ప ప్రస్తావన ఆగదట. ఈ చిత్రాన్ని మరో భాగానికి పొడిగించే పనిలో ఉన్నాడట సుకుమార్. ‘పుష్ప.. ది రోర్’ పేరుతో ‘పుష్ప 3’ని తీర్చిదిద్దడానికి స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాడట. సెకండ్ పార్ట్ అవుట్ పుట్ అత్యద్భుతంగా వస్తుండడంతో.. ఈ ఫ్రాంచైస్ లో థర్డ్ ఇన్ స్టాల్ మెంట్ ను కూడా తీసుకొచ్చేందుకు ఇటు హీరో అల్లు అర్జున్.. అటు నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాడట సుక్కూ.

ప్రస్తుతం హైదరాబాద్ లో జాతర ఎపిసోడ్ చిత్రీకరణ పూర్తిచేసుకున్న ‘పుష్ప 2’ టీమ్.. త్వరలో జపాన్ వెళ్లబోతుంది. అక్కడ ‘పుష్ప 2’ క్లైమాక్స్ ఎపిసోడ్ కు సంబంధించి సన్నివేశాల చిత్రీకరణ జరగనుందట. ఆ సీన్స్.. లీడ్ టు థర్డ్ పార్ట్ అన్నట్టు ఉంటాయట. ఇప్పటివరకూ రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో తన స్మగ్లింగ్ బిజినెస్ ను విస్తరించిన పుష్ప రాజ్.. థర్డ్ పార్ట్ లో ఇంటర్నేషనల్ లెవెల్ లో ఎర్రచందనాన్ని.. స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని రూల్ చేయనున్నాడట.

Related Posts