వైసీపీ నాయకులు, కోవూరు శాసన సభ్యులు శ్రీ ప్రసన్న కుమార్ రెడ్డి సినిమా నిర్మాతలను ఉద్దేశించి మాట్లాడుతూ… మన సినిమా నిర్మాతలను బలిసినవాల్లు, అని అనడం జరిగింది. ఈ వ్యాఖ్యలను తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా ఓ ప్రెస్ నోట్ ను కూడా విడుదల చేసింది.
ఇది చాలా బాధాకరం, నిజ నిజాలు తెలియకుండా ఒక గౌరవ శాసన సభ్యులు ఈ విధంగా మాట్లాడటం, మొత్తం తెలుగు సినిమా పరిశ్రమను అవమానించినట్టు గా భావిస్తున్నాం. మన తెలుగు సినిమా సక్సెస్ రేటు సుమారుగా 2 నుండి 5%మాత్రమే. మిగిలిన సినిమాలు నష్టపోవడం జరుగుతుంది. చిత్రసీమలో ఉన్న 24 క్రాఫ్ట్స్ కు పని కల్పిస్తూ, అనేక ఇబ్బందులు పడి, కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాలు తీసిన నిర్మాతలు, చివరకు ఆస్తులు అమ్ముకోవడం జరుగుతుంది. ఈ కష్ట, నష్టాల, బారిన పడి కొంతమంది నిర్మాతలు చలన చిత్ర నిర్మాతల మండలి నుండి నెలకు 3000/- రూపాయలు పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది.
దీనిని బట్టి చలన చిత్ర నిర్మాతలు ఎటువంటి దారుణ పరిస్థితులలో ఉన్నారన్న సంగతి తేట తెల్లమవుతుంది. ఇవేమీ తెలుసుకోకుండా.. గౌరవ శాసన సభ్యులు శ్రీ. ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిర్మాతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేస్తూ వారి వ్యాఖలను ఉపసంహరించుకోవాలని కోరుచున్నాం అని నిర్మాతల మండలి అధికారికంగా ప్రకటించింది. మరి.. ప్రసన్న కుమార్ రెడ్డి స్పందిస్తారేమో చూడాలి.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.…
Any update regarding Tamil Dalapathy Vijay goes viral on social media within moments of its…
Among the crazy movies coming this year at pan India level is 'Kalki 2898 AD'.…
Not only the first song from 'Devara'.. the second song is also coming as a…
Television actor Chandu's suicide has created a sensation. Serial actress Pavitra died in a car…
Natural Star Nani is on a good streak. He has a string of hits to…