మహేష్ ను కాదని మాస్ రాజాతో

తెలుగులో నిన్నటి వరకూ టాప్ హీరోయిన్ గా భావించిన పూజాహెగ్డే.. ఓవర్ నైట్ మీడియం రేంజ్ హీరోయిన్ అయిపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా రూపొందుతోన్న గుంటూరు కారంలో మెయిన్ హీరోయిన్ గా ఉన్న తను శ్రీ లీల దెబ్బకు సైడ్ అయిపోయింది.

ఆ తర్వాత తన ప్రాజెక్ట్స్ ఏంటా అంటే ఇప్పటి వరకూ సరైన క్లారిటీ లేదు. కాకపోతే సాయితేజ్ హీరోగా సంపత్ నంది డైరెక్ట్ చేసే సినిమాలో తనే హీరోయిన్ అనే టాక్ వచ్చింది. ఈ చిత్రానికి సహ నిర్మాత త్రివిక్రమ్ కావడం విశేషం. ఇక తన రెమ్యూనరేషన్ కు బదులుగా గుంటూరు కారంలో ఐటమ్ సాంగ్ చేయడానికి ఓకే అందనే టాకూ ఉంది.దీంతో పాటు బాలీవుడ్ ఓ మూవీ ఓకే అయింది. అయితే తాజాగా మరో వార్త వినిపిస్తోంది. అమ్మడికి మాస్ మహరాజ్ సరసన ఛాన్స్ వచ్చిందట.


వరుస సినిమాలతో వందే భారత్ రైల్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు రవితేజ. రిజల్ట్ తో పనిలేకుండా యేడాదికి మూడు సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ దసరాకు టైగర్ నాగేశ్వరరావుగా రాబోతోన్న రవితేజ.. సంక్రాంతికి ఈగల్ లా ఎంటర్ అవబోతున్నాడు.

వీటితో పాటు సితార బ్యానర్ లోనూ, హరీష్ శంకర్ డైరెక్షన్ లో దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా ఓకే అయింది.వీటిలో హరీష్ శంకర్ డైరెక్ట్ చేసే సినిమాలో పూజాహెగ్డేను హీరోయిన్ గా తీసుకుంటున్నారు అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకూ ఈ ఇద్దరూ కలిసి నటించలేదు.దీంతో కాంబినేషన్ కూడా కొత్తగా ఉంటుంది.

పైగా హరీష్ శంకర్ అంటే పూజాకు స్పెషల్ రెస్పెక్ట్. దువ్వాడ జగన్నాథమ్ తో తన కెరీర్ కు ఓ కొత్త టర్న్ ఇచ్చాడనే ఈ గౌరవం.అందుకే ఈ మూవీలో తను నటించే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయంటున్నారు. సో.. మహేష్ మూవీని కాదని మాస్ రాజాతో జోడీ కట్టబోతోందన్నమాట.

Related Posts