పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. మరో వైపు హరి హర వీరమల్లు సినిమా తాజా షెడ్యూల్ త్వరలో స్టార్ట్ కానుంది. ఈ సినిమా పూర్తైన తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఇందులో పవన్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటింనుంది. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఓ భారీ చిత్రం చేయనున్నారు.
దీనికి సంబంధించి డిజిటల్ డీల్ క్లోజ్ అయ్యిందని తెలిసింది. ప్రఖ్యాత జీ స్టూడియోస్ సంస్థ ఆ మేరకు ఒప్పంద చేసుకుందని సమాచారం. జీ- నెట్ వర్క్ టాలీవుడ్ లో బలమైన అడుగులు వేస్తోంది. అగ్ర నిర్మాణ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకుంటూ బలం పెంచుకుంటోంది. జీ ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ రైట్స్ దక్కించుకుంది. అలాగే నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్లో రూపొందుతోన్న బంగార్రాజు సినిమా నిర్మాణంలో పార్ట్ నర్ గా ఉంది.
అలాగే ఆర్ఆర్ఆర్ డిజిటల్ స్ట్రీమింగ్ భాగస్వామిగానూ ఉంది.
తాజా సమాచారం మేరకు.. పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ అండ్ శాటిలైట్ హక్కులను జీ – ఛానెల్ ఛేజిక్కించుకుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాకుండానే డీల్ క్లోజ్ అవ్వడం విశేషం. ముందు ముందు పలువురు అగ్ర హీరోల చిత్రాల రైట్స్ ను జీ సంస్థ ఛేజిక్కించుకోనుందుకు ప్లాన్ చేస్తుంది.
రెబెల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాకి చాలా లేటుగా ఎంటరయ్యాడు. పైగా ప్రభాస్ నుంచి వచ్చే అప్డేట్స్ అరుదుగా ఉంటాయి.…
జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లోని తన ఇంటి స్థలం వివాదంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని…