ప‌వ‌న్ క‌ళ్యాణ్ ద‌ర్శ‌కుల‌పై క‌న్నేసిన రౌడీ

చిన్నా చిత‌కా పాత్ర‌ల‌తో కెరీర్ స్టార్ట్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఇప్పుడు స్టార్ హీరో. మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. అయితే ఈ ఫాలోయింగ్‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లేలా రౌడీస్టార్‌కి సరైన హిట్ ప‌డి చాలా కాల‌మే అవుతుంది. లైగ‌ర్‌తో పాన్ ఇండియా హీరో అవుదామ‌ని అనుకుంటే.. ఆ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. దీంతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరీతో చేస్తోన్న త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్ JGMను ఆపేశాడు. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఖుషి సినిమాపై ఫోక‌స్ చేశాడు. ఈ సినిమా త‌ర్వాత ఎవ‌రితో సినిమా చేయాల‌నే దానిపై మ‌న క‌థానాయ‌కుడు అన్వేష‌ణలో పడ్డ‌ట్లు టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

అయితే సినీ స‌ర్కిల్స్‌లో వినిస్తోన్న స‌మాచారం మేర‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ దృష్టి ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా టైటిల్స్ పైనే కాదు డైరెక్ట‌ర్స్‌పై ప‌డింద‌ట‌. ఎందుకంటే ఖుషి సినిమా అనేది ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ. దాన్ని త‌న నెక్ట్స్ మూవీ టైటిల్‌గా విజ‌య్ పెట్టుకున్నాడు. ఇప్పుడు త‌దుప‌రి హ‌రీష్ శంక‌ర్‌తో సినిమా చేయ‌బోతున్నాడ‌ని కూడా అంటున్నారు. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో విజ‌య్ దేవ‌ర‌కొండ – హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా ఉంటుంద‌ని టాక్‌.

హ‌రీష్ శంక‌ర్ చాలా రోజులుగా ప‌వ‌న్ కోసం వెయిటింగ్‌లో ఉన్నాడు. భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ప‌వ‌న్ ఏమో రాజ‌కీయాల్లో బిజీగా ఉన్నారు. త‌న సినిమా స్టార్ట్ కావ‌టానికి ఇంకా స‌మ‌యం ప‌ట్టేలా ఉండ‌టంతో హ‌రీష్‌.. గ్యాప్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమా చేస్తే ఎలా ఉంటుంద‌ని ఆలోచిస్తున్నాడ‌ని న్యూస్ చ‌క్క‌ర్లు కొడుతుంది. మ‌రి దీనిపై హ‌రీష్ శంక‌ర్ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Related Posts