పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూకుడు పెంచాడు. వరుసగా చేస్తోన్న ప్రాజెక్ట్స్ కు డేట్స్ ఇస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తతం సుజీత్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఓజి ఈ యేడాది డిసెంబర్ లోనే వస్తుందంటున్నారు. ఇక జూలై 28న సాయితేజ్ తో కలిసి సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన బ్రో విడుదల కాబోతోంది. మరోవైపు హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ రూపొందుతోంది.
అయితే ఈ మధ్యలో అతను ఖైదీ, విక్రమ్ ఫేమ్ లోకేష్ కనకరాజ్ తో ఓ సినిమా చేయబోతున్నాడ అనే రూమర్స్ వినిపించాయి. దీంతో సౌత్ లో ఇదో క్రేజీ కాంబినేషన్ అవుతుంందటూ రకరకాల కథనాలు మొదలయ్యాయి. నిజమే.. ఈ కాంబోలో ఓ సినిమా పడితే తెలుగులో రికార్డులన్నీ బద్ధలైపోతాయి. కానీ అది నిజం కాదు.
పవన్ కళ్యాణ్ – లోకేష్ కనకరాజ్ కాంబోలోసినిమా అనే వార్త నిజం కాదు అని తేల్చారు. ప్రస్తుతం లోకేష్ .. విజయ్ తో మాస్టర్ తర్వాత లియో అనే మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం ఈ యేడాది దసరా సందర్భంగా అక్టోబర్ 20న విడుదల కాబోతోంది. ఆ తర్వాత ఖైదీకి సీక్వెల్ తోపాటు విక్రమ్ కు సీక్వెల్ చేస్తాడు.
ఈ రెండు సినిమాల సీక్వెల్స్ ను కలపుతూ.. మల్టీవర్స్ మరో ప్రాజెక్ట్ ఉంది. ఇన్ని ప్రాజెక్ట్స్ మధ్య పవన్ తో సినిమా చేయడం అసాధ్యం. పైగా పవన్ ఎప్పుడ డేట్స్ ఇస్తాడోఎవరికీ తెలియదు. ఒక్కసారి స్టార్ట్ అయితే పని ఆపడం లోకేష్ స్టైల్ కాదు. అలా చూసినా ఆయన ఇప్పుడప్పుడే పవన్ తోసినిమా చేస్తాడు అనుకోలేం. సో.. ఈ కాంబినేషన్ గురించి వస్తోన్న వార్తలన్నీ అబద్ధమే అన్నమాట.
Politics in Telugu states has become more heated now. At such a time, the original…
Dashing Puri Jagannadh and Ustad Ram's combo 'Ismart Shankar' became a super duper hit. Now…
గతంలో ఎప్పుడూ లేనివిధంగా మలయాళం నుంచి చాలా తక్కువ సమయంలో నాలుగు బ్లాక్బస్టర్స్ వచ్చాయి. ఆ చిత్రాలే 'ప్రేమలు, ది…
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఇప్పుడు మరింత వేడెక్కింది. ఇలాంటి తరుణంలో థియేటర్లలోకి రాబోతున్న అసలు సిసలు పొలిటికల్ థ్రిల్లర్ 'ప్రతినిధి…
If compared to the heroes in the film industry.. the span of heroines is very…
డాషింగ్ పూరీ జగన్నాధ్, ఉస్తాద్ రామ్ కాంబోలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఇప్పుడా సినిమాకి…