త్రివిక్ర‌మ్, థ‌మ‌న్. నాగ‌వంశీల‌తో ఫోటో షేర్ చేసిన మ‌హేష్‌. సోష‌ల్ మీడియాలో వైర‌ల్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్ర‌స్తుతం గీత గోవిందం డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ తో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ బాబు.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో సినిమా చేయ‌నున్నారు. ఈ సినిమాని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై చిన‌బాబు నిర్మించనున్నారు. ఈ సినిమాని ఎప్పుడో అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేశారు కానీ.. ఆత‌ర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు.

అయితే.. ఈ రోజు మ‌హేష్ బాబు త్రివిక్ర‌మ్, థ‌మ‌న్, నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీతో ఉన్న ఫోటోను షేర్ చేసి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌నే విష‌యాన్ని తెలియ‌చేశారు. వ‌ర్క్ అండ్ చిల్ అంటూ మ‌హేష్ ఈ ఫోటోను ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు.

ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఈపాటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాలి కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల‌న ఆల‌స్యం అయ్యింది. త్వ‌ర‌లోనే ఈ క్రేజీ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నున్న‌ట్టు స‌మాచారం.

Related Posts