సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రానికి గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ సమయంలో మహేష్ బాబు మెకాలికి మైనర్ గాయం అయినట్టుగా టాలీవుడ్ లో టాక్ వినిపించింది. ఇప్పుడు మహేష్ బాబు అమెరికా ప్రయాణం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా.. సర్జరీ అనంతరం మహేష్ బాబు రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట.
అందుచేత సర్కారి వారి పాట సినిమా షూటింగ్ కు రెండు నెలలు బ్రేక్ పడనున్నదట. ఈ నేపథ్యంలో మహేష్ బాబు గాయం నుంచి త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. అంతే కాకుండా ట్విట్టర్ లో #getwellsoonmaheshbabuanna అనే హాష్ స్టాగ్ కూడా ట్రెండ్ అవుతుంది. అయితే.. ప్రచారంలో ఉన్నట్టుగా మహేష్ మోకాలి గాయం నిజమేనా..? అమెరికా ప్రయాణం వార్తల్లో వాస్తవం ఎంత అనేది తెలాయాల్సివుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. సర్కారు వారి పాట 2022లో ఏప్రిల్ 1న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో చేయాలనుకున్న మూవీని త్వరలో స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.