కీర్తి సురేష్ హత్యాకాండకు వణికిపోవాల్సిందే..?

కొన్ని పాత్రల్లో అద్భుతమైన నటన చూపించడంలో ఈ తరం హీరోయిన్లలో కీర్తి సురేష్ తర్వాతే ఎవరైనా. మహానటితో జాతీయ అవార్డ్ అందుకున్న కీర్తి.. ఆ తర్వాత కమర్షియల్ హీరోయిన్ గా ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నా.. ఫీమేల్ లీడ్ లో చేసిన సినిమాలతో నటిగా సత్తా చాటుతోంది. అయితే ఇప్పటి వరకూ ఏ హీరోయిన్ కూడా సాహసం చేయని పాత్రతో రాబోతోంది కీర్తి సురేష్. అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతోన్న ఈచిత్రం సాని కాయిదమ్. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఆ ట్రైలర్ చూస్తుంటేనే ఒళ్లు గగుర్పొడిచేలా కనిపిస్తోంది. ఆ రేంజ్ లో ఉన్నాయి కీర్తి సురేష్ చేసిన హత్యలు.

కీర్తి సురేష్ తో పాటు దర్శకుడు సెల్వరాఘవన్ కీలక పాత్ర చేశాడు. ఓ రకంగా ఈ ఇద్దరే ప్రధాన పాత్రధారులు ఈ సినిమాలో. ఈ ఇద్దరినీ ఇన్వెస్టిగేట్ చేస్తోన్న పోలీస్ డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. అతని పేరు సంగయ్య. గ్యాస్ సిలిండర్స్ డెలివరీ చేసే వ్యక్తినని ట్రైలర్ లో చెబుతున్నాడు. ఎన్ని హత్యలు చేశావు అంటే.. ఒక్కో ఊరి పేరు చెబుతూ.. ఒకటీ రెండు ఐదు, పది అంటూ లెక్కలు చెబుతూ మొత్తం 24గా తేలుస్తాడు. అతను చెబుతున్నప్పు చూస్తున్నవారి గుండె దడపుట్టాల్సిందే. అదే టేబిల్ పై కీర్తిని ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. తన పేరు పొన్ని అని చెబుతుంది. గతంలో కానిస్టేబుల్ గా పనిచేసిన పొన్ని పాతిక హత్యలు చేశాము అంటుంది. దీనికి పోలీస్ అంటాడు.. అతను 24 అంటుంటే నువ్వు 25 అంటున్నావేంటీ అని అడుగుతాడు. అంటే ఇలాగే ఇరిటేట్ చేస్తే నిన్నూ చంపేస్తాను. నీతో కలిపి మొత్తం పాతిక అంటుంది. ఇక ఆ తర్వాత మొదలవుతుంది.. హత్యాకాండ. అబ్బో ఓ రేంజ్ లో ఉన్నాయి విజువల్స్. మరి వీరు ఇన్ని హత్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది అనే కీలకమైన పాయింట్ ను ట్రైలర్ తో దాచాడు దర్శకుడు. బట్ ఈ ట్రైలర్ చూశాక ఖచ్చితంగా ఓ రా అండ్ రస్టిక్ విలేజ్ డ్రామా అని అర్థం అవుతుంది. మే 6 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతోన్న ఈ చిత్రానికి అరుణ్ మాతేశ్వరన్ దర్శకుడు. ఇప్పటి వరకూ కీర్తి సురేష్ చేసిన ఓటిటి సినిమాలేవీ పెద్దగా ఆకట్టుకోలేదు. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.

Related Posts