పవన్ కళ్యాణ్ సినిమాలో యమగోల సీక్వెన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూకుడు పెంచాడు. ఇప్పటికే వరుస ప్రాజెక్ట్స్ లో హీట్ పెంచిన పవన్.. ఆ ప్రాజెక్ట్స్ ను కంప్లీట్ చేసేందుకు కరెక్ట్ ప్లానింగ్ తో వెళుతున్నాడు. ముందుగా మొదలైనవి కాదని మధ్యలో భీమ్లా నాయక్ చేయడం వల్ల ఆ నిర్మాతలు, దర్శకులు కొంత ఫీలయ్యారనేది నిజం. అందుకే ఈ సారి కొత్త రీమేక్ ను పక్కన బెట్టి.. ఫస్ట్ ప్రాజెక్ట్ కే ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లుకు సంబంధించి ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ఫినిష్ చేశాడు. అయితే ఈ మూవీకి కాస్త పొలిటికల్ టచ్ కూడా ఇచ్చారట.

భీమ్లా నాయక్ తో భారీ విజయం అందుకున్నాడు పవన్ కళ్యాణ్. అటు ఏపి ప్రభుత్వం ఇబ్బంది పెట్టినా ఫ్యాన్స్ ధాటికి ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది. అయినా మరింత పెద్ద విజయాన్ని ఏపి ఆపగలిగింది అనుకోవచ్చు. ఈ మూవీ తర్వాత మరో కోలీవుడ్ చిత్రాన్ని రీమేక్ చేస్తాడు అనే వార్తలు వచ్చాయి. కానీ ఆల్రెడీ అనౌన్స్ అయిన ప్రాజెక్ట్ ల నిర్మాతల రిక్వెస్ట్ వల్ల ఆ రీమేక్ నే ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టారట. పైగా ఆ మూవీకి సంబంధించి తెలుగు వెర్షన్ ఇంకా పూర్తి కాలేదు. అందుకే క్రిష్ డైరెక్షన్ లో ఏఎమ్ రత్నం నిర్మిస్తోన్న హరిహర వీరమల్లు చిత్రానికి పూర్తి టైమ్ కేటాయించాడు.

హరిహర వీరమల్లులో పవన్ ఓ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తాడు. పైగా ఇది హిస్టారికల్ ఫిక్షన్ మూవీగా వస్తోంది. అందుకే ఆ కాలాన్ని అడ్డుపెట్టుని ఈ కాలపు రాజకీయాలపై కొన్ని సెటైర్స్ కూడా ఉంటాయని టాక్. దీనికి ఎన్టీఆర్ నటించిన పాత యమగోలను ఆదర్శంగా తీసుకున్నారంటున్నారు. అంటే అప్పట్లో యమలోకం వెళ్లిన హీరో అక్కడి వ్యవహారాలకు నాటి పాలిటిక్స్ కు మిక్స్ చేసి చెప్పిన డైలాగ్స్ అద్భుతంగా పేలాయి. అదే తరహాలో ఈ సారి పవన్ కళ్యాణ్ తో రాజు ఆస్థానంలో అలాంటి డైలాగ్స్ చెప్పిస్తారట. అంటే ఖచ్చితంగా ఇది పవన్ ఫ్యాన్స్ కు డబుల్ జోష్ ఇచ్చే వార్తే అవుతుంది. మొత్తంగా ఈ మూవీ తర్వాత హరీష్ శంకర్ కు డేట్స్ ఇవ్వబోతున్నాడు పవన్. మరి ఈ చిత్రాలన్నీ వచ్చే ఎన్నికల్లోగా ఫినిష్ అవుతాయా లేదా అనేది చూడాలి.