పవన్ కళ్యాణ్ ను కన్ఫ్యూజన్ లో పెట్టిన జగన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను మరోసారి కన్ఫ్యూజన్ లో పెట్టాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇదెలా లింక్ అవుతుందీ అనుకుంటున్నారా..ఉంటుంది. ఉంటుంది. ఒక్కోసారి చిన్నగా కనిపించిన అంశమే పెద్ద సమస్య తెస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని వ్యవహారం అలాగే ఉంది. ఆ మేటర్ కు ఫుల్ స్టాప్ పడితే కానీ.. భీమ్లా నాయక్ మేటర్ తేలేలా కనిపించడం లేదు. అసలు ఈ ప్రాబ్లమ్ క్లియర్ అయిందా లేక క్లియర్ అయినట్టుగా కనిపిస్తోందా అనేది అందరికీ క్వశ్చన్ మార్క్ లా మారింది.
ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల పంచాయితీ ఒక కొలిక్కి వచ్చింది అని మాత్రమే చెబుతూ వస్తున్నారు కానీ.. క్లియర్ అయిందని మాత్రం తేల్చడం లేదు. అంటే టికెట్ రేట్ల గురించి ప్రభుత్వం పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్టుగానే చెబుతున్నారు. ఇంకా అఫీషియల్ జీవో లాంటిది రాలేదు. అయితే ఎక్స్ ట్రా షోస్ విషయంతో పాటు స్పెషల్ షోస్ మేటర్ ఇంకా తేలాల్సి ఉంది. ఈ కారణంగానే భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ విషయంలో జగన్ నాటకం ఇంకా కొనసాగుతూనే ఉంది.
జగన్ ఒక స్పష్టమైన మాట ఇవ్వడం లేదా జీవో లాంటిది ఇస్తే కానీ.. టికెట్స్ తో పాటు ఇతర ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. ఆ తర్వాతే పెద్ద సినిమాలకు అక్కడి నుంచి పెద్ద రిలీఫ్ వస్తుంది. దీనికోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే ఆ ఎదురుచూపులకు నిన్నటి మీటింగ్ లో జగన్ కామా పెట్టాడు కానీ ఫుల్ స్టాప్ పెట్టలేదు. అతను ఒక నిర్ణయం తీసుకుంటే భీమ్లా నాయక్ ను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
ఈ క్లారిటీ ఈ వారంలో వస్తే.. ఈ నెల 25నే విడుదల చేయాలనుకుంటున్నారు. లేదంటే వాళ్లు చెప్పిన రెండో డేట్ ఏప్రిల్ 1న విడుదల చేస్తారు. ఏదైనా పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజన్ కు ఓ క్లారిటీ రావాలంటే ముందు జగన్ నుంచి ఒక స్పష్టత రావాల్సి ఉందన్నమాట.

Related Posts