నాగ చైతన్యతో రీమేక్ చేస్తున్నాడా లేక..?

అక్కినేని నాగ చైతన్య కూడా దూకుడు పెంచాడు. ఇతరులను చూసి స్పీడ్ పెంచాడా లేక.. ఇక ఇప్పుడు ఏ ‘బాదరబందీ’ లేదు కాబట్టి దూసుకుపోతున్నాడా అనేది చెప్పలేం కానీ ఇప్పటికే రెండు ప్రాజెక్ట్స్ సెట్స్ లో ఉండగా లేటెస్ట్ గా మరో మూవీ మొదలుపెట్టాడు. ప్రస్తుతం అతను నటిస్తోన్న థ్యాంక్యూ అనే సినిమా చివరిదశలో ఉంది. తర్వాత ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఇదీ మొదలైంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ తర్వాత నందినీ రెడ్డి డైరెక్షన్ లో సినిమా ఉంటుంది అనుకున్నారు చాలామంది. కానీ అనూహ్యంగా కొన్నాళ్ల క్రితం నుంచే.. కోలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు పేరు వినిపిస్తోంది. వినిపించడమే కాదు లేటెస్ట్ గా కన్ఫార్మ్ కూడా అయింది.
నాగచైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్ లో సినిమా అఫీషియల్ గా ప్రారంభం అయింది.
ఈ చిత్రం తెలుగు, తమిళ్ బై లింగ్వుల్ గా రాబోతోంది. చైతూ ఇప్పటి వరకూ తమిళ్ లో సినిమాలు చేయకపోయినా.. సమంత వ్యవహారంతో అక్కడ కూడా బాగా ఫేమ్ అయ్యాడు. ఆ ఫేమ్ ఈ చిత్రానికి అతనికి తమిళ్ లో ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. మరోవైపు వెంకట్ ప్రభు అంటే మోస్ట్ టాలెంటెడ్ అని అందరికీ తెలుసు. అందుకే ఇది అతనికి పర్ఫెక్ట్ కోలీవుడ్ ఎంట్రీగా చెప్పొచ్చు. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తోన్న ఈచిత్రం స్ట్రెయిట్ మూవీగానే వస్తోంది.
రీసెంట్ గా వెంకట్ ప్రభు అక్కడ శింబు హీరోగా ఓ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. మానాడు పేరుతో వచ్చిన ఈ మూవీని తెలుగులో చైతూ హీరోగా రీమేక్ చేస్తారు అనుకున్నారు. కానీ కాదు. రీమేక్ అయితే కేవలం తెలుగులో మాత్రమే చేసేవారు కదా. ఇది బై లింగ్వుల్ గా వస్తోంది. అంటే కొత్త కథే అనుకోవచ్చు. మొత్తంగా ఇవాళ ప్రారంభం అయిన ఈ చిత్రంలో పనిచేసే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేస్తారు.

Related Posts