పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే జంటగా నటించిన భారీ పీరియాడిక్ మూవీ రాధేశ్యామ్. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ పాన్ ఇండియా మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థలు యు.వి. క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. సాహో తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా కావడంతో ఎప్పుడెప్పుడు రాధేశ్యామ్ విడుదల అవుతుందా అని ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న రాధేశ్యామ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే..ఈ డిసెంబర్ 23న రాధేశ్యామ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొట్టమొదటి నేషనల్ లెవెల్ ఈవెంట్ గా ఈ ఫంక్షన్ ని ప్లాన్ చేశారు. ఈ ఫంక్షన్ లో రాధేశ్యామ్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. అయితే.. ఈ ట్రైలర్ ని ఎంతసేపు కట్ చేశారో క్లారిటీ వచ్చింది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఈ ట్రైలర్ నిడివి 3 నిమిషాల 3 సెకన్లు వచ్చిందట. దీంతో మూడు నిమిషాల మూడు సెకన్లలో ఏం చూపించనున్నారు అనేది ఆసక్తిగా మారింది.
మరో విషయం ఏంటంటే.. ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పరమహంస పాత్ర పోషిస్తున్నారు. దీనికి సంబంధించిన లుక్ విడుదలైంది. ఆధ్యాత్మికంగా ఉన్న ఆయన లుక్కు మంచి స్పందన వస్తుంది. దీంతో రాధేశ్యామ్ పై మరింత ఆసక్తి ఏర్పడింది. కృష్ణంరాజు, ప్రభాస్ కలిసి నటిస్తున్న రాధేశ్యామ్ ఏ రేంజ్ సక్సస్ సాథిస్తుందో..? ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో..? చూడాలి.