అంతకు ముందు ఎన్ని సినిమాలు చేసినా.. ”డిజే టిల్లు” తో ఓ రేంజ్ లో ఫేమ్అయిపోయడు సిద్ధు జొన్నలగడ్డ. అంతకు ముందు చేసిన గుంటూర్ టాకీస్ లో అతని నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. అలాగే కృష్ణ అండ్ హిజ్ లీలలో అతని ఈజ్ ఎంతోమందికి నచ్చింది. ఈ రెండిటినీ మిక్స్ చేసి డిజే టిల్లులో కనిపించాడు.
కట్ చేస్తే ఈ మూవీకి స్టార్ హీరోలు కూడా ఫ్యాన్స్ అయిపోయారు. అందుకే ఇప్పుడు అతనికి నిర్మాతలకు కొదవ లేదు. వరుసగా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం డిజే టిల్లుకు సీక్వెల్ గా డిజే టిల్లు స్క్వేర్ అనే మూవీ చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోందీ చిత్రంలో. సితార బ్యానర్ లోనే రూపొందుతోన్న ఈ సీక్వెల్ కు బడ్జెట కూడా పెంచారు. పైగా ఆల్రెడీ ఫ్యాన్సీ రేట్ కే అమ్ముడైపోయిందని కూడా అంటున్నారు.
దీంతో ఇప్పుడు మళయాల తల్లుమాల మూవీని రీమేక్ చేయబోతున్నాడు. ఈ క్రమంలో లేటెస్ట్ గా మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అనే టాక్ వినిపిస్తోంది. అది కూడా నిన్నటి వరకూ టాప్ స్టైలిస్ట్ గా ఉన్న నీరజ కోన దర్శకత్వంలో కావడం విశేషం.
నీరజ కోన తెలుగులో టాప్ హీరోయిన్లందరకీ స్టైలిస్ట్ గా పనిచేసింది. టాలీవుడ్ లోనే కాక కోలీవుడ్ లో కూడా మంచి పరిచయాలున్నాయి. పైగా ఆమె అన్న కోన వెంకట్ టాప్ రైటర్. ఇవన్నీ కలిసొచ్చా లేక తను నిజంగా దర్శకురాలు కావాలనే ప్యాషన్ తో స్టార్ట్ చేసిందా తెలియదు కానీ.. రీసెంట్ గా తను ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ కమ్ థ్రిల్లర్ తరహాలో సాగే కథను సిద్ధుకు వినిపించిందట. కథ నచ్చడంతో టిల్లు వెంటనే ఎస్ చెప్పాడు అని టాక్. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ అవుతుంది.
'పుష్ప 2' మ్యూజికల్ జర్నీ ఇటీవలే మొదలైంది. ఈ మోస్ట్ అవైటింగ్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ 'పుష్ప పుష్ప'…
Four blockbusters have come out of Malayalam in a very short time like never before.…
Politics in Telugu states has become more heated now. At such a time, the original…
Dashing Puri Jagannadh and Ustad Ram's combo 'Ismart Shankar' became a super duper hit. Now…
గతంలో ఎప్పుడూ లేనివిధంగా మలయాళం నుంచి చాలా తక్కువ సమయంలో నాలుగు బ్లాక్బస్టర్స్ వచ్చాయి. ఆ చిత్రాలే 'ప్రేమలు, ది…
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఇప్పుడు మరింత వేడెక్కింది. ఇలాంటి తరుణంలో థియేటర్లలోకి రాబోతున్న అసలు సిసలు పొలిటికల్ థ్రిల్లర్ 'ప్రతినిధి…