సూపర్ స్టార్ మహేష్ నెక్ట్స్ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుందా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. కానీ.. తాజాగా సినీ సర్కిల్స్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు SSMB 28 షూటింగ్కి డేట్ ఫిక్స్ అయ్యిందట. సెప్టెంబర్ 8 నుంచి సినిమా రెగ్యులర్ చిత్రీకరణ షురూ అవుతుందట. యాక్షన్ సీక్వెన్స్తో షూటింగ్ను స్టార్ట్ చేస్తారు. 25 రోజుల పాటు షెడ్యూల్ జరుగుతుందని టాక్. సినిమాలో హీరోయిన్గా నటిస్తోన్న పూజా హెగ్డే అక్టోబర్ లేదా నవంబర్ నుంచి ప్రారంభం కానున్న షెడ్యూల్లో పాల్గొననుందని వార్తలు వినిపిస్తున్నాయి.
త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు ఏ సినిమాల్లో కనిపించని గడ్డం.. మీసం లుక్లో కనిపించబోతున్నారు. అలాగే సిక్స్ ప్యాక్లో దర్శనమీయబోతున్నారు. దీని కోసం ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ లుక్ను డిజైన్ చేసిన ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ మహేష్ను ట్రైన్ చేస్తున్నారు.
మహేష్, త్రివిక్రమ్ దర్శకత్వంలో అతడు, ఖలేజా సినిమాలు రూపొందాయి. ఆ రెండు సినిమాలు బుల్లి తెరపై హిట్ అయ్యాయి. కానీ.. సిల్వర్ స్క్రీన్పై డిజాస్టర్ అయ్యాయి. దీంతో త్రివిక్రమ్ ఈసారి మరింత శ్రద్ధ తీసుకుని ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఓ డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నారట. పదేళ్ల తర్వాత మహేష్.. త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతోన్న చిత్రమిది. భారీ అంచనాలతో సినిమా తెరకెక్కనుంది.