మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఆచార్య రీషూట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 4న ఆచార్య ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే… చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాల్లో నటిస్తున్నారు. ఆచార్యతో కలిపితే… నాలుగు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ నాలుగు సినిమాలు సెట్స్ పై ఉండగానే.. మరో సినిమాను అనౌన్స్ చేశారు.
అదే.. ఛలో, భీష్మ చిత్రాల దర్శకుడు వెంకీ కుడుములతో సినిమా. ఈ భారీ చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ మెంట్ చూసి మెగా ఫ్యాన్స్ సైతం షాక్ అయ్యారు. ఎప్పుడో 1984 సంవత్సరంలో చిరంజీవి ఒకే సంవత్సరంలో పది సినిమాలకు పైగా రిలీజ్ చేశారు. ఆతర్వాత మళ్లీ అలాంటి ఫీట్ చేయలేకపోయారు. ఆతర్వాత సంవత్సరానికి మూడు సినిమాల నుంచి ఒకటికి పడిపోయింది.
అయితే.. ఇప్పుడు ఇంత వేగం ఎందుకు చూపిస్తున్నారంటే దానికి ఓ కారణం ఉంది. అది ఏంటంటే.. భారీ బడ్జెట్టు.. విదేశాలకు వెళ్లే అవసరం లేకుండా ఉండే కథలనే ఆయన ఓకే చేస్తున్నారట. దీని వలన సమయంతో పాటు నిర్మాత డబ్బు కూడా ఆదా అవుతుంది. దానయ్య బ్యానర్ లో చిరంజీవితో త్రివిక్రమ్ సినిమా ఉండాలి అయితే.. అది సాధ్యం కాకపోవడం వలనే త్రివిక్రమ్ తన శిష్యుడు వెంకీ కుడుమలను రికమండ్ చేశాడని టాక్. రెండు సినిమాల అనుభవం ఉన్న వెంకీని నమ్మడం వెనకున్న అసలు కారణం ఇదే కావచ్చు. ఏది ఏమైతేనే.. చిరు స్పీడు మామూలుగా లేదు. ఇప్పట్లో ఆలేలా లేదు.
Samantha is at the forefront of the stars who have a huge following on social…
It should be said that Rajinikanth is a well-known Indian actor in Japan. Rajinikanth's film…
Summer is the biggest season for movies. However.. this summer is going very dull. On…
సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో సమంత ముందు వరుసలో ఉంటుంది. ట్విట్టర్ లో పది మిలియన్లకు…
ఒకప్పుడు జపాన్ లో బాగా తెలిసిన ఇండియన్ యాక్టర్ అంటే రజనీకాంత్ అని చెప్పాలి. రజనీకాంత్ నటించిన 'ముత్తు' చిత్రం…