అక్కినేని నాగచైతన్య, సమంత.. ఏమాయ చేశావే సినిమాలో నటించడం.. ఆతర్వాత ప్రేమలో పడడం.. పెళ్లి చేసుకోవం తెలిసిందే. టాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న చైతు – సామ్ విడాకులు తీసుకుంటున్నట్టుగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. విడాకుల తర్వాత ఒకరినొకరు కలుసుకోలేదు. అయితే.. విడాకుల గురించి సమంత మాట్లాడింది కానీ.. చైతన్య మాత్రం ఎప్పటిలానే సైలెంట్ గా తన పని తను చేసుకుంటున్నాడు.
వీరిద్దరూ విడిపోయినప్పటికీ.. ఒకే ఫీల్డ్ లో ఉన్నవారు కావడంతో ఏదొక సందర్భంలో ఒకరికొకరు ఎదురు పడాల్సిన పరిస్థితి వస్తుందని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగా ఇటీవల అలాంటి సందర్భం వచ్చిందట. అయినప్పటికీ.. ఇద్దరూ ఒకరినొకరు చేసుకోకుండా జాగ్రత్త పడ్డారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఎప్పుడు..? ఎక్కడంటే.. చైతన్య నటిస్తున్న బంగార్రాజు సినిమా లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో జరిగిందట. సమంత ప్రధాన పాత్ర పోషిస్తున్న యశోద చిత్రీకరణ కూడా అదే స్టూడియోలో జరిగిందట. అయితే.. చైతు – సామ్ ఒకరికొకరు ఎదురుపడకుండా చూసుకోవాలని తమ సిబ్బందికి తెలియజేశారట.
వారి ఆదేశాలకు తగినట్లుగా ఏర్పాట్లు చేయడంతో నాగచైతన్య మరియు సమంత ఇద్దరూ తమ పనులను పూర్తి చేసుకొని.. ఒకరినొకరు చూసుకోకుండానే స్టూడియో నుండి బయలుదేరారని టాక్ వినిపిస్తోంది. ఈ వార్త అలా.. అలా బయటకు వచ్చింది. దీంతో విడిపోయినా ప్రెండ్స్ లా ఉంటామన్నారు కదా..? మరి.. ఇలా ఎందుకు ఉంటున్నారు..? అంటూ షాక్ అవుతున్నారు. ఇక భవిష్యత్ లో కూడా కలుసుకోవడానికి ఇష్టపడరేమో.
మే 3న థియేటర్లలో సినిమాల జాతర ఉండబోతుంది. తెలుగు నుంచి మూడు సినిమాలు.. అనువాద రూపంలో మరొకటి కలిపి నాలుగు…
There will be a film fair in theaters on May 3. Three films from Telugu..…
After 'Hanuman' became a blockbuster, the expectations for the sequel 'Jai Hanuman' have increased. Director…
'హనుమాన్' బ్లాక్బస్టర్ సాధించడంతో సీక్వెల్ 'జై హనుమాన్'పై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్…
Tamil Ilayadalapathy Vijay is going to be busy with full-fledged politics soon. In this context,…
తమిళ ఇళయదళపతి విజయ్ త్వరలో పూర్తిస్థాయి రాజకీయాలతో బిజీ కాబోతున్నాడు. ఈనేపథ్యంలో సినిమాల నుంచి పూర్తిగా బ్రేక్ తీసుకోబోతున్నాడనే ప్రచారం…