చైతూ రేంజ్ మారబోతోందా..?

కొన్ని కాంబినేషన్స్ చూస్తే అలాగే అనిపిస్తుంది. ఒకప్పుడు మంచి విజయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన నాగచైతన్య ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అంతే కాదు.. టైర్ టూ హీరోల్లో తనే నెంబర్ వన్ కాబోతున్నాడనే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. నిన్నటి వరకూ ఈ ప్లే స్ లో నాని ఉంటాడు అనుకున్నారు.కానీ సినిమా సినిమాకూ అతని గ్రాఫ్ పడిపోతుంది. ఇటు చైతూ సినిమా సినిమాకూ రేంజ్ మార్చుకుంటూ వెళుతున్నాడు. దీంతో ఈ బ్యాచ్ లో తనే నెంబర్ వన్ కాబోతున్నాడని ఖచ్చితంగా చెబుతోంది ఇండస్ట్రీ. ఈ టైమ్ లో తన రేంజ్ ఇంకా మారే కాంబినేషన్ ఇప్పుడు రాబోతోంది. అది కూడా కోలీవుడ్ నుంచి వస్తుండటం విశేషం.ప్రస్తుతం చైతూ నటించిన థ్యాంక్యూ విడుదలకు సిద్ధంగా ఉంది. జూలై 9న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత ఆమిర్ ఖాన్ తో నటించిన లాల్ సింగ్ చద్దా ఆగస్ట్ 12న రిలీజ్ అవుతుంది. మరోవైపు దూత అనే వెబ్ సిరీస్ లో కూడా యాక్ట్ చేస్తున్నాడు చైతూ.

ఈ ప్రాజెక్ట్స్ పట్టాలపై ఉండగానే రీసెంట్ గా మోస్ట్ టాలెంటెడ్ తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో సినిమా అనౌన్స్ అయింది. వెంకట్ రీసెంట్ గా అక్కడ శింబుతో మానాడు అనే సూపర్ హిట్ మూవీ తీసి ఉన్నాడు. హాలీవుడ్ రేంజ్ టేకింగ్ తో ఈ మూవీ మెస్మరైజింగ్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వెంటనే నాగచైతన్యతో బై లింగ్వుల్ కు ఓకే చెప్పాడు.నాగచైతన్య, వెంకట్ ప్రభు సినిమాలో హీరోయిన్ గా బంగార్రాజు భామ కృతిశెట్టిని తీసుకున్నారు. పెద్ద విశేషం ఏంటంటే.. ఈ మూవీకి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజాతో పాటు ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా సంయుక్తంగా మ్యూజిక్ అందిస్తున్నారు. తండ్రి కొడుకు కలిసి ఓ తెలుగు సినిమాకు సంగీతం అందించడం ఇదే ఫస్ట్ టైమ్. మొత్తంగా భారీ కాన్వాస్ తోనే ఈ మూవీని ప్లాన్ చేసుకున్నారనేది అర్థం అవుతోంది. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తోన్న ఈ మూవీతో చైతూ అటు తమిళ్ లో కూడా ఫేమ్ అవుతాడనే చెప్పొచ్చు.

Related Posts