బండ్ల గణేష్‌ మాటల వెనక ఉన్నది ఎవరు..?

వేదికలపై మాట్లాడుతున్నప్పుడు కాస్త వెనకా ముందు చూసుకుని మాట్లాడాలి అంటారు. ముఖ్యంగా సినిమా పరిశ్రమల్లో ఈ మాటలు చాలా దూరం వెళతాయి. ఎక్కువ మంది చూసే అవకాశం ఉండటం వల్ల వాటి రీచే కాదు.. తర్వాత వచ్చే పరిణామాలు కూడా పెద్దగానే ఉంటాయి. ఇక ఒక్కసారి మైక్ చేతికి దొరికితే ఏం మాట్లాడతాడో కూడా అర్థం కానట్టుగా కనిపిస్తాడు బండ్ల గణేష్‌. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ గురించి అంటే అతనికి పూనకాలు వస్తాయి. అందుకే అతని స్పీచ్ లకు కూడా సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారనేది నిజం. అయితే ఇప్పటి వరకూ మాట్లాడిందంతా.. కేవలం ఒకరిని మోయడానికే లేదా ఆ ఫంక్షన్ కు హైప్ తేవడానికే అన్నట్టుగా కనిపించేది. కానీ నిన్న చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్‌ మాటలు చాలామందికి షాక్ ఇచ్చాయి. ఇంత ధైర్యంగా అతను మాట్లాడతాడని ఎవరూ ఊహించి ఉండరు. అది కూడా ఏకంగా పూరీనే టార్గెట్ చేసుకుని మరీ డైలాగులు పేల్చాడు. ఆ డైలాగ్ ల సౌండ్ చాలా దూరం వెళ్లింది. చాలామందికి తగులుతుందని కూడా చెప్పొచ్చు.తన కొడుకు ఫంక్షన్ కు పూరీ రాలేదు అంటే అది అతని పర్సనల్ మేటర్ అని ఎవరైనా అనుకుంటారు.

కానీ నిన్న బండ్ల మాట్లాడింది చూస్తే అతను రాకపోవడానికి కారణం పూరీ జగన్నాథ్ ”పర్సనల్” వల్లే అని ఎవరికైనా సులువుగానే అర్థం అవుతుంది. పైగా ”వ్యాంప్ లు ర్యాంప్”లు వస్తుంటారు పోతుంటారు.. మా ఒదిన(పూరీ భార్య లావణ్య) పర్మనెంట్ అంటూ ఇన్ డైరెక్ట్ గా పెద్ద పంచ్ వేశాడు. మరోవైపు తను ఈ ఫంక్షన్ కు రావడానికి కారణం కేవలం లావణ్య గారు మాత్రమే అని ఆమెను కూడా ఓ రేంజ్ లో పొగిడేశాడు.పూరీ జేబులో రెండు మూడు వందలు ఉన్నప్పుడే ఆమె అతని వెంట వచ్చిందనీ.. ఇప్పుడు డబ్బులు వచ్చాక చాలామంది చేరారని డేరింగ్ స్టేట్మెంటే ఇచ్చాడు.అయితే బండ్ల మాటలు ఇప్పుడు టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అయ్యాయి. ఎంత శ్రేయోభిలాషి అయినా మరీ వ్యక్తిగత విషయాలను కూడా డైరెక్ట్ గానో ఇన్ డైరెక్ట్ గానో పబ్లిక్ ఫంక్షన్స్ లో మాట్లాడటం అనేది చిన్న విషయమైతే కాదు. దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా అనేది కూడా చాలామంది ఆరాలు తీస్తున్నారు. ఓ నిర్మాతగా బండ్లకు టెంపర్ సినిమా చేశాడు పూరీ. ఆ టైమ్ లోనే ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు వచ్చాయి. వాటిని దృ