టాలీవుడ్‌పై బి.జె.పి దృష్టి.. నితిన్‌తో న‌డ్డా భేటీ

టాలీవుడ్ హ‌వా క్ర‌మంగా పెరుగుతోంది. మ‌న సినిమాలు బాలీవుడ్ సినిమాల‌నే ప‌క్క‌కి తోసేస్తూ ముందుకు దూసుకెళ్లిపోతున్నాయి. ఒక‌ప్పుడు ఎవ‌రూ ప‌ట్టించుకోని తెలుగు సినిమాల‌ను, టాలీవుడ్ స్టార్స్‌ను ఇప్పుడు దేశం యావ‌త్తు ఫాలో అవుతుంది. వారి స్టైల్‌ను అనుక‌రిస్తూ రీల్ వీడియోలు చేసేస్తున్నారు. పొలిటీషియ‌న్స్ కూడా ఇప్పుడు టాలీవుడ్‌పై ప్ర‌త్యేక‌మైన దృష్టి పెట్టిన‌ట్టు తెలిసింది.. ముఖ్యంగా బీజేపీ నాయ‌కులు.

రీసెంట్‌గా కేంద్ర హోం మంత్రి అమిత్ షా .. టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ని ప్ర‌త్యేకంగా క‌లిశారు. వారిద్ద‌రూ క‌లిసి డిన్న‌ర్ కూడా చేశారు. వారేం మాట్లాడుకున్నారో ఎవ‌రూ బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. కానీ.. తెలంగాణ బీజేపీలోకి ఎన్టీఆర్‌ని ఆయన ఆహ్వానించారని, ఇక్కడ పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రిని చేస్తామన్నారని కొందరు తమ అభిప్రాయాలను తెలియజేశారు.

మరికొందరైతే ఏపీపై బీజేపీ ప్రత్యేకమైన దృష్టి పెట్టిందని అందుకనే తారక్‌ని అమిత్ షా కలిశారని, తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ కైవ‌సం చేసుకోబోతున్నార‌ని, అదీ ఇదీ అంటూ వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి. ఈ వేడి చ‌ల్లార‌క ముందే మ‌రో తెలుగు హీరోను మ‌రో బీజేపీ అగ్ర నాయ‌కుడు క‌లవ‌బోతున్నారు. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో తెలుసా!.. నితిన్‌. బీజేపీ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా.

ఈరోజు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్ర‌త్యేకంగా క‌ల‌వ‌బోతున్నార‌ట‌. దీంతో అస‌లు బీజేపీ నాయ‌కులు ఎందుకు టాలీవుడ్ హీరోల‌ను ప్ర‌త్యేకంగా క‌లుస్తున్నారా? అనేది ప్ర‌త్యేక‌మైన చ‌ర్చ‌గా మారింది. మరి భవిష్యత్తులో ఇంకెంత మంది తారలను బీజేపీ నాయకులను కలుస్తారో చూడాలి మరి.

Telugu 70mm

Recent Posts

‘Satya’ trailer.. A love story with naturalness

New age romantic love stories are always well received. And.. Tamilians show special attention in…

4 mins ago

‘ప్రతినిధి 2’కి సెన్సార్ ఇబ్బందులేంటి?

ప్రస్తుతం యావత్ దేశంలో ఎన్నికల హడావుడి జోరుగా ఉంది. ముఖ్యంగా.. ఆంధ్రప్రదేశ్ లో అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ ఎన్నికలు…

11 mins ago

అతిథి పాత్రకోసం ఆరు కోట్లు పారితోషికం

మంచు విష్ణు నటిస్తూ నిర్మాస్తోన్న మెగా ప్రాజెక్ట్ ‘కన్నప్ప‘. శివ భక్తుడు కన్నప్ప కథాంశంతో అత్యంత భారీ బడ్జెట్ తో…

2 hours ago

‘ఆహా‘లో రానున్న ‘విద్య వాసుల అహం’

‘కోట బొమ్మాళి పి.ఎస్‘ సినిమాతో మంచి విజయాన్నందుకున్న రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘విద్య వాసుల…

2 hours ago

మే 10న బాక్సాఫీస్ వద్ద సినిమాల జాతర

ఈ వేసవిలో ఇప్పటివరకూ ఒకటీరెండు సినిమాలు తప్ప.. పెద్దగా ప్రేక్షకులను మెప్పించిన సినిమాలైతే రాలేదు. ఒకవైపు ఎన్నికల వేడి.. మరోవైపు…

2 hours ago

‘ఆర్య‘ అనుభవాలు పంచుకోబోతున్న టీమ్

‘ఆర్య‘ సినిమా.. అల్లు అర్జున్ ని హీరోగా నిలబెట్టిన చిత్రం. దర్శకుడిగా సుకుమార్ కి జీవితం ఇచ్చిన సినిమా. నిర్మాతగా…

2 hours ago