భీమ్లా నాయక్ పోస్ట్ పోన్..?

సంక్రాంతి.. తెలుగు సినిమాకు అతి పెద్ద సీజన్. సంక్రాంతి కాకుండా మరే పండగకూ ఫ్యామిలీ ఆడియన్సెస్ థియేటర్స్ రారు. అందుకే ఆ టైమ్ ను పెద్ద సినిమాలు గ్రాబ్ చేస్తాయి. చిన్న సినిమాలను పూర్తిగా సైడ్ చేసి తామే అన్ని థియేటర్స్ ను ఆక్రమించుకుంటాయి. అయితే ఈ సారి సంక్రాంతి బరిలో ఒకేసారి మూడు సినిమాలంత పెద్ద సినిమాగా చెప్పుకుంటోన్న ఆర్ఆర్ఆర్ విడుదలవుతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ కు ముందే సంక్రాంతి బరిలో రిలీజ్ ప్లాన్ చేసుకున్న చిత్రాలను ఆర్ఆర్ఆర్ కోసం బలవంతంగా పోస్ట్ పోన్ చేయించారు. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించింది టాప్ డిస్ట్రిబ్యూటర్స్ లో ఒకడైన దిల్ రాజు. అయితే సంక్రాంతి బరిలోనే ఉన్న భీమ్లా నాయక్ మాత్రం పోస్ట్ పోన్ కావడానికి ఒప్పుకోలేదు.
భీమ్లా నాయక్ ను సంక్రాంతి నుంచి తప్పించాలని దిల్ రాజు చాలా ప్రయత్నాలు చేశాడు. నిర్మాతలు ఒకే చెప్పినా పవన్ ఒప్పుకోలేదు. రీసెంట్ గా దిల్ రాజు త్రివిక్రమ్ ను కలిసి పరిస్థితి వివరించాడు. త్రివిక్రమ్ ను కన్విన్స్ చేయగలిగినా.. అతను కూడా ఫైనల్ డెసిషన్ పవన్ కళ్యాణ్ దే అని చెప్పాడు. దీంతో దిల్ రాజు మరోసారి పవన్ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. కానీ పవన్ దిల్ రాజు మాట వింటాడు అనుకోలేం. ఒకవేళ విన్నా ఫ్యాన్స్ ఒప్పుకుంటారా అనేది పెద్ద ప్రశ్న.
నిజానికి దిల్ రాజు పై అత్తారింటికి దారేదీ తర్వాత నుంచి పవన్ ఫ్యాన్స్ లో మంచి అభిప్రాయం లేదు. వారి అభిప్రాయాన్ని దాటి పవన్ కళ్యాణ్ కూడా దిల్ రాజు మాటను గౌరవిస్తాడనుకోలేం. ఏదేమైనా ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ చిత్రాలను నైజాంలో దిల్ రాజే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఒక సినిమా కోసం మరో సినిమాను వదులుకోవడానికి ఆయన రెడీగా ఉన్నప్పుడు పవన్ కూడా ఆలోచిస్తాడు అనేది అతని వెర్షన్. బట్.. ఒక్కసారి కమిట్ అయితే తన మాట తనే వినని రకం పవన్. మరి ఈ ఇద్దరి మధ్య దిల్ రాజు గెలిస్తే పవన్ ఫ్యాన్స్ ఫీలవుతారు. పవన్ నో చెబితే ఆర్ఆర్ఆర్ అభిమానులు హర్ట్ అవుతారు. మరి ఈ ప్రాబ్లమ్ ను ఎలా సాల్వ్ చేసుకుంటారో చూడాలి.

Related Posts