‘ఆడవాళ్ల’ను తరిమేసిన భీమ్లా నాయక్

అనుకున్నది ఒకటి అయినది ఒక్కటి అని సినిమావాళ్ల విషయంలో ఎక్కువగా జరుగుతుంటుంది. సినిమాలపై అంచనాల నుంచి రిలీజ్ డేట్స్ వరకూ వాళ్లు ఊహించేది ఒకటైతే ఫైనల్ గా కనిపించేది మరోటి అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు ఆడవాళ్లూ మీకుజోహార్లు సినిమా సిట్యుయేషన్ కూడా ఇదే కావడం విశేషం. ఈ నెల 25న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా నటించిన భీమ్లా నాయక్ ను విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. వీళ్లు ప్రత్యామ్నాయంగా ఏప్రిల్ 1ని కూడా అనౌన్స్ చేశారు. దీంతో ఈ నెలలో పవన్ కళ్యాణ్ రాడు అన్న ధైర్యంతో వరుణ్ తేజ్ గనితో పాటు శర్వానంద్ ఆడవాళ్లూ మీకు జోహార్లు సినిమాల రిలీజ్ డేట్స్ ను ఫిబ్రవరి 25అని వేసుకున్నారు. బట్ వీళ్లిద్దరికీ షాక్ ఇస్తూ భీమ్లా నాయక్ బరిలోకి దిగుతున్నా అని ప్రకటించాడు. ఒకవేళ భీమ్లాతో పోటీ పడాలన్నా వీలు లేకుండా బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ ముందే ‘సెట్’చేసి పెట్టుకున్నాడు.
మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే మరో పెద్ద స్టారే రావడానికి ఆలోచిస్తారు. అలాంటిది ఈ చిన్నవాళ్లు వస్తే ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడతారు. పవన్ మూవీ అంటే టాక్ తో పనిలేకుండా వీకెండ్ అంతా స్ట్రాంగ్ గానే ఉంటుంది. పైగా భీమ్లా నాయక్ బాగా వచ్చిందనే టాక్ ఇండస్ట్రీ అంతా ఉంది. అదీ కాక ఆల్రెడీ హిట్ అయిన సబ్జెక్ట్ నే రీమేక్ చేశారు కాబట్టి.. చాలా వరకూ కాన్ఫిడెంట్ గానే ఉన్నారు.
సో.. ప్రస్తుతం వినిపిస్తోన్నదాన్నిబట్టి.. గని మూవీకి సంబంధించి ఇంకా డిసైడ్ కాలేదు కానీ.. ఆడవాళ్లూ మీకుజోహార్లు చిత్రాన్ని మాత్రం ఏప్రిల్ 8న విడుదల చేసే అవకాశాలున్నాయంటున్నారు. నిజానికి ఆ డేట్ కూడా చాలా పెద్ద సినిమాల ముందు ఉంది. బలమైన కంటెంట్ ఉంటే తప్ప వర్కవుట్ కాదు. పైగా ఇప్పుడు శర్వానంద్ మార్కెట్ ఏ మాత్రం బాగా లేదు. అటు దర్శకుడుగా కిశోర్ కు మంచి పేరున్నా.. అంత క్రేజ్ లేదు. ఎటొచ్చీ ఈ మూవీ హీరోయిన్ రష్మిక మందన్నా మీదుగానే ప్రేక్షకులను చేరాలి. మరి ఆ సత్తా రష్మికకు ఉందా లేదా అనేది సినిమా వస్తే కానీ తెలియదు.

Related Posts