సౌత్ ఇండియాలో హీరోగా, కేరక్టర్ ఆర్టిస్టుగా, విలన్గా జనాల్లో స్పెషల్ క్రేజ్ ఉన్న నటుడు విజయ్ సేతుపతి. ఆయన నటిస్తున్న హిందీ సినిమా మెరీ క్రిస్మస్. ఈ సినిమా షూటింగ్ నార్త్ ఇండియాలో జరుగుతోంది. మెరీ క్రిస్మస్లో కత్రినాకైఫ్ నాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గ్యాప్లో విజయ్ సేతుపతిని కత్రినా కైఫ్ ఫొటో తీశారు. ఆ ఫొటోలో విజయ్ సేతుపతి ఏదో లోతుగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. మాసిన గడ్డం, గ్లాసెస్తో విజయ్ సేతుపతి లుక్ చాలా డిఫరెంట్గా ఉంది. సోషల్ మీడియాలో తన పర్సనల్ పిక్స్ ని పెద్దగా షేర్ చేయరు విజయ్ సేతుపతి. అందుకే, డీప్గా ఆలోచిస్తున్నట్టున్న ఆయన ఫొటో ఇన్స్టంట్గా వైరల్ అయింది. దానికి తోడు ఫొటో తీసింది నేనే అంటూ కత్రినా కైఫ్ క్రెడిట్ని క్లెయిమ్ చేసుకుంటూ షేర్ చేయడంతో నెటిజన్లు హాట్ కామెంట్స్ చేస్తున్నారు.
విజయ్ సేతుపతి ఈ సినిమాతో పాటు రాజ్, డీకే తెరకెక్కిస్తున్న ఓ వెబ్సీరీస్లోనూ నటిస్తున్నారు. ఈ వెబ్సీరీస్లో కబీర్సింగ్ ఫేమ్ షాహిద్ కపూర్ మెయిన్ లీడ్ చేస్తున్నారు. ప్రస్తుతం మెరీ క్రిస్మస్ షూటింగ్లో ఉన్న విజయ్ సేతుపతి, త్వరలోనే జవాన్ సెట్స్ కి హాజరవుతారు. షారుఖ్ ఖాన్ నటిస్తున్న జవాన్ సినిమా కోసం 21 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేసి విలన్ కేరక్టర్కి ఓకే చెప్పారు విజయ్ సేతుపతి. మరోవైపు సౌత్లో మైఖేల్ అనే సినిమాలో నటిస్తున్నారు విజయ్ సేతుపతి. ఇందులో సందీప్ కిషన్ క్రూషియల్ రోల్ చేస్తున్నారు. విడుదలై అనే సినిమా షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ చేశారు మక్కల్ సెల్వన్.