నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన రీసెంట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం అఖండ. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రూపొందిన అఖండ చిత్రం గత డిసెంబర్ లో రిలీజ్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవర్ సీస్ లో సైతం రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసింది. బాలయ్య కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా అఖండ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇదిలా ఉంటే.. బాలయ్య నెక్ట్స్ మూవీని క్రాక్ సినిమాతో సక్సస్ సాధించిన మలినేని గోపీచంద్ తో చేస్తున్నారు. ఇందులో బాలయ్య సరసన అందాల తార శృతిహాసన్ నటించనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తుంది. అయితే.. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను ఈ జనవరి 21 నుంచి స్టార్ట్ అవ్వనున్నట్టు తెలుస్తుంది. దీనిని కూడా సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చెయ్యాలని చూస్తున్నారట.
మరో విషయం ఏంటంటే.. ఈ చిత్రానికి జై బాలయ్య అనే టైటిల్ పరిశీలిస్తున్నారని సమాచారం. ఇక ఈ సినిమాకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. మరి.. అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన బాలయ్య తదుపరి చిత్రంతో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధిస్తారేమో చూడాలి.