BreakingNews :కాశ్మీర్ ఫైల్స్ నిర్మాతకి ఆక్సిడెంట్ ..

కాశ్మీర్ ఫైల్స్ మూవీ ప్రొడ్యూసర్, నటి, నేషనల్ అవార్డు విన్నర్ పల్లవి జోషి పెద్ద ప్రమాదానికి గురయ్యారు. మరాఠి చిత్రాలలో నటిగా సత్తా చాటిన పల్లవి జోషి కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి భార్య కూడా. బాలనటిగా తెరంగేట్రం చేసిన పల్లవి ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులు గెలుచుకుంది. ప్రస్తుతం వివేక్ దర్శకత్వం లో తెరకెక్కుతోన్న వాక్సిన్ వార్ అనే సినిమా కోసం హైదరాబాద్ లో షూటింగ్ లో ఉంది.

ఈ మూవీ షూటింగ్ లో భాగంగానే ఒక వాహనం అదుపు తప్పి పల్లవి జోషి ని బలంగా ఢీకొన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో పల్లవికి తీవ్రంగా గాయాలు అయ్యాయి అంటున్నారు. హైదరాబాద్ లోనే ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు చెబుతున్నారు.


పల్లవి జోషి నటిగానే కాక రచయితగా, నిర్మాతగానూ సుపరిచితురాలు. ఆమె ఈ ప్రమాదం నుంచి సేఫ్ గా బయట పడాలని కోరుకుందాం.

Related Posts