సెలబ్రిటీస్ కు సంబంధించిన వీడియోస్ ను మార్ఫింగ్ చేసి కొంతమంది ఆకతాయిలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించి ఫేక్ వీడియోస్ ను సృష్టిస్తూ.. వాళ్లు ఆ సెలబ్రిటీలే అన్నంతగా అందిరినీ ప్రభావితం చేస్తున్నారు. లేటెస్ట్ గా హీరోయిన్ రష్మిక మందన్న ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
రష్మిక ఫేక్ వీడియోపై బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ నుంచి.. టాలీవుడ్ నుంచి నాగచైతన్య వరకూ ఎంతోమంది సెలబ్రిటీస్ స్పందించారు. ఇక.. ఈ విషయంలో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా రష్మికకు అండగా నిలిచింది. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్.. రష్మిక ఫేక్ వీడియోస్ ను ఖండించింది.
తాజాగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మి నారాయణ, జనరల్ సెక్రటరీ వై.జె. రాంబాబు.. తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ గారిని కలిసి ఈ విషయంపై పిర్యాదు చేసారు. బాధ్యతగా వ్యవహరించిన అసోసియేషన్ ని అభినందించిన అంజనీ కుమార్ గారు వెంటనే ఈ కేస్ ను సైబర్ క్రైం కి అప్పగించారు. మునుముందు ఇలాంటి చర్యలు జరిగిన వెంటనే తమ దృష్టికి తీసుకు రావాలని అసోసియేషన్ కి సూచించారు.
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…
'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే.. మరో రెండు రోజులు మాత్రమే ఉంది. యంగ్ టైగర్ బర్త్ డే…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.…
Any update regarding Tamil Dalapathy Vijay goes viral on social media within moments of its…