గోవా ఫెస్టివల్ లో రామ్ చరణ్, అనుష్క రాజసం

గోవాలో 54వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రారంభమైంది. నవంబర్ 20 నుంచి 28 వరకూ ఈ చిత్రోత్సవం జరగనుంది. తెలుగు నుంచి పెద్దగా సినిమాలు లేకపోయినా.. కన్నడ నుంచి ‘కాంతార’, మలయాళం నుంచి ‘ఇరట్ట’ వంటి సినిమాలు ఈ వేడుకలో ప్రదర్శితమవుతున్నాయి. ఇక.. భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో తెలుగు వారికి చోటు దక్కడం లేదని అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా.. గోవా ఫిల్మ్ ఫెస్టివల్స్ లో హిందీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తుల ఫోటోలు తప్పితే.. మన దక్షిణాది వారి ఫోటోలు లేవనేది చిరు ఆవేదన.

అయితే.. ఇప్పుడు చిరంజీవి కోరిక నెరవేరింది. ఏకంగా గోవా ఫిల్మ్ ఫెస్టివల్ ముఖ ద్వారం వద్దే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఫోటోని పెట్టారు. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలోని అల్లూరి గెటప్ లో ఉన్న చరణ్ ఫోటోని.. ‘బాహుబలి’లోని దేవసేన గా రాజసం చూపిస్తున్న అనుష్క ఫోటోని పక్కన పక్కన పెట్టారు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్ కి హాజరవుతోన్న సినీ ప్రేమికుల్ని ఈ ఫోటోలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Related Posts