రేపు థియేటర్లలోకి రాబోతున్న చిత్రాలు

వారం వారం థియేటర్లలో కొత్త సినిమాల సందడి కొనసాగుతూనే ఉంది. దీపావళికి విడుదలైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. దీంతో ఈ వారం విడుదలతోన్న సినిమాలపై ఫోకస్ పెరిగింది. ఈ శుక్రవారంపలు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఆ చిత్రాలలో ముందుగా చెప్పుకోవాల్సింది ‘మంగళవారం‘.

‘ఆర్.ఎక్స్.100‘ సినిమాతో దర్శకుడిగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు అజయ్ భూపతి. ఆ తర్వాత ‘మహా సముద్రం‘ చేసినా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు ‘ఆర్.ఎక్స్.100‘ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో ‘మంగళవారం‘ సినిమా తెరకెక్కించాడు. ముద్ర మీడియా వర్క్స్ బ్యానర్ పై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ.ఎం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో.. పాయల్ రాజ్ పుత్ అందాలు ప్రధాన ఆకర్షణగా ‘మంగళవారం‘ సినిమా రాబోతుంది. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు బాగా ఆకట్టుకున్నాయి.

హన్సిక లీడ్ రోల్‌ లో ఓంకార్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మై నేమ్ ఈజ్ శృతి’. వైష్ణవి ఆర్ట్స్ బ్యానర్ పై బురుగు రమ్య ప్రభాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్గాన్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందింది. అమ్మాయిలను హత్యలు చేసి వాళ్ల స్కిన్ ను వేరొకరికి గ్రాఫ్టింగ్ చేయడమే ఈ సినిమాలోని మెయిన్ స్టోరీ. ఈ సినిమా కూడా రేపు విడుదలవుతోంది.

రేపు థియేటర్లలోకి రాబోతున్న మరికొన్ని చిత్రాలలో ‘స్పార్క్, అన్వేషి, సప్తసాగరాలు దాటి సైడ్ బి‘ కూడా ఉన్నాయి. విక్రాంత్‌, మెహరీన్, రుక్సార్ థిల్లాన్ ప్రధాన పాత్రల్లో ‘స్పార్క్‘ చిత్రం రూపొందింది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఇక.. ఆద్యంతం అడవి నేపథ్యంలో విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో ‘అన్వేషి‘ సినిమా రూపొందింది.

కన్నడ నుంచి అనువాద రూపంలో వస్తోన్న సినిమా ‘సప్తసాగరాలు దాటి సైడ్ బి‘. రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ హీరోహీరోయిన్లుగా రూపొందిన ‘సప్తసాగరాలు దాటి సైడ్ ఎ‘కి కొనసాగింపుగా ఈ చిత్రం రాబోతుంది.

Related Posts